NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli: బృందావన్‌ను సందర్శించిన విరాట్‌-అనుష్క దంపతులు
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli: బృందావన్‌ను సందర్శించిన విరాట్‌-అనుష్క దంపతులు
    బృందావన్‌ను సందర్శించిన విరాట్‌-అనుష్క దంపతులు

    Virat Kohli: బృందావన్‌ను సందర్శించిన విరాట్‌-అనుష్క దంపతులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2025
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తాను అమితంగా ఇష్టపడే బృందావన్‌ను మరోసారి సందర్శించాడు.

    ఆయన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌తో కలిసి ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించారు.

    ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ, "గతంలో మేము ఇక్కడ వచ్చినప్పుడు నా మనసులో కొన్ని ప్రశ్నలు ఉండేవి. వాటిని అడగాలని అనుకున్నాను. కానీ, ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. వారు కూడా మిమ్మల్ని ప్రశ్నలే అడుగుతున్నారు.నేను మనసులోనే వారి తో మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆ మర్నాడు నేను ఏకాంత వ్రతాలాప్‌ను ఓపెన్‌ చేశాను. అందులో కొందరు నా మనసులో ఉన్న ప్రశ్నలను అడిగారు," అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రేమ భక్తి పొందాలని కోరుకుంది.

    వివరాలు 

    కెరీర్‌లో గడ్డుకాలం

    అనుష్క మాట్లాడుతుండగానే కోహ్లీ తన కుమార్తెను చూసి పలకరిస్తున్నాడు.

    ఆమె అడిగిన ప్రశ్నలకు ప్రేమానంద్‌ మహారాజ్‌ స్పందిస్తూ, "మీరు ఎంతో ధైర్యవంతులు. ఈ ప్రపంచంలో ఇంత గౌరవం పొందిన తర్వాత భక్తి మార్గాన్ని అవలంబించడం చాలా కష్టం. మీరు చూపుతున్న భక్తికి కచ్చితంగా సమాధానం లభిస్తుంది," అని చెప్పారు.

    2023 జనవరిలో కూడా విరాట్‌-అనుష్క జంట ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించింది.

    కెరీర్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కోహ్లీ బృందావన్‌ను సందర్శించడం విశేషం.

    తాజా సమాచారం ప్రకారం,కోహ్లీ ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా ఇంగ్లాండ్‌ సిరీస్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీపై పెట్టుకున్నాడు.

    బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో ఐదు టెస్టులు ఆడిన కోహ్లీ కేవలం 190 పరుగులు మాత్రమే చేసినందున, ఈ విషయం అతన్ని విమర్శలకు గురిచేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బృందావన్‌లో విరుష్క దంపతులు 

    Virat Kohli and Anushka Sharma visited Vrindavan with their children to seek blessings from Premanand Baba, experiencing divine peace and positivity.🌟🤍🙏#AnushkaSharma #ViratKohli #Vrindavan #BhajanMarg #INDvsENG pic.twitter.com/mUdorTA8cR pic.twitter.com/9Go2M4x907

    — ELVISA🦋 (@ELVISA_AMBANI) January 10, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ

    తాజా

    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ

    విరాట్ కోహ్లీ

    T20 World Cup: విరాట్ కోహ్లీ-అర్ష్‌దీప్ భాంగ్రా డ్యాన్స్ అదుర్స్  టీ20 ప్రపంచకప్‌
    Bengaluru: విరాట్ కోహ్లీకి చెందిన పబ్ వన్8 కమ్యూన్‌పై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు   బెంగళూరు
    Virat Kohli: రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆటతీరుపై ఓ లుక్కేయండి రోహిత్ శర్మ
    Virat Kohli: వన్డే సిరీస్ కోసం శ్రీలంక చేరుకున్న విరాట్ కోహ్లీ .. సెల్ఫీల కోసం ఎగబడ్డ  అభిమానులు  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025