Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ.. ఆటగాళ్లందరికీ వార్నింగ్!
ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. భారత్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు అందరికి బీసీసీఐ యోయో టెస్టును నిర్వహించింది. యోయో టెస్టులో విరాట్ కోహ్లీ 17.2 స్కోర్ సాధించినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ఏదైనా గోప్యమైన పోస్టులను చేయవద్దని కోహ్లీని మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. కోహ్లి యో-యో టెస్టుకు సంబంధించిన స్కోర్ను పోస్ట్ చేయడం బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు నచ్చలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
యో యో టెస్టును పాసైన రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా
జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని కోహ్లీ సహా ఆటగాళ్లను హెచ్చరిస్తున్నామని, ట్రైనింగ్ సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకోవచ్చని, అయితే స్కోర్ లను, అంతర్గత విషయాలను బహిర్గతం చేయకూడదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. 16.5 స్కోరు దాటితేనే ఫిట్ నెస్ టెస్టులో పాసైనట్టు. అయితే కోహ్లీ 17.5 స్కోరు స్కోరు సాధించి తన తోటి ఆటగాళ్లకు సవాల్ విరుసుతున్నాడు. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా కూడా ఈ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.