NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Ranji Trophy 2025: విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధం 
    తదుపరి వార్తా కథనం
    Ranji Trophy 2025: విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధం 
    విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధం

    Ranji Trophy 2025: విరాట్ కోహ్లీ కీలక ప్రకటన.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 21, 2025
    09:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశారు.

    దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి హాజరుకానున్నట్లు తెలిపారు.

    గతంలో 2012లో రంజీ మ్యాచ్ ఆడిన కోహ్లీ, ఇప్పుడు మళ్లీ ఆప్రముఖ టోర్నీలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

    రంజీ ట్రోఫీకి సంబంధించిన మ్యాచ్‌లు జనవరి 23 నుంచి దిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరుగుతాయి.

    అయితే, కోహ్లీ మెడ నొప్పితో బాధపడుతున్న కారణంగా ఈ మ్యాచ్‌లో పాల్గొనలేకపోతున్నట్లు సమాచారం.

    జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ కోసం కోహ్లీ అందుబాటులో ఉంటారని సమాచారం.

    ఈ విషయాన్ని కోహ్లీ దిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశారని,జట్టు ప్రధాన కోచ్ శరణ్‌దీప్ సింగ్ వెల్లడించారు.

    వివరాలు 

    మహ్మద్ షమీ రీఎంట్రీ

    ఇక,బీసీసీఐ ఇటీవల అన్ని ప్లేయర్లను దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని ఆదేశించింది.

    స్టార్ ఆటగాళ్లకు కూడా మినహాయింపులు ఇవ్వరని స్పష్టం చేసింది.ఈ నిర్ణయం నేపథ్యంలో,కెప్టెన్ రోహిత్ శర్మ (ముంబయి),రిషబ్ పంత్ (దిల్లీ),రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శుభ్‌మన్ గిల్ (పంజాబ్), యశస్వి జైస్వాల్ (ముంబయి)వంటి ప్రముఖ క్రికెటర్లు ఈసారి రంజీ ట్రోఫీలో పాల్గొనబోతున్నారు.

    ఇక, రేపటి నుంచి (జనవరి 22) టీమిండియా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ప్రారంభించనుంది.

    కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, జడేజా టీ20ల్లో రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు.

    సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారథిగా వ్యవహరిస్తారు, వైస్‌ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. ఈ సిరీస్‌తో ప్రముఖ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ

    తాజా

    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ
    Chiranjeevi : చిరంజీవి-అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. షూటింగ్ పై కీలక అప్డేట్ చిరంజీవి
    Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు అమరావతి
    Ola Roadster X: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్ ఓలా

    విరాట్ కోహ్లీ

    Virat Kohli: వన్డే సిరీస్ కోసం శ్రీలంక చేరుకున్న విరాట్ కోహ్లీ .. సెల్ఫీల కోసం ఎగబడ్డ  అభిమానులు  క్రీడలు
    Virat Kohli: శ్రీలంకతో ఇవాళ రెండో వన్డే.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే సచిన్ టెండూల్కర్
    Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ టీమిండియా
    Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన? ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025