Virat Kohli: డొమెస్టిక్ ఫ్లైట్లో విరాట్ కోహ్లీ ప్రయాణం.. అశ్చర్యపోయిన ప్రయాణికులు (వీడియో)
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. ఈ శతకంతో వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత బెంగళూరుకు ఇండిగో విమానం ఎక్కి ఎకానమీ క్లాస్లో విరాట్ కోహ్లీ ప్రయాణించాడు. తోటి ప్రయాణికులు కోహ్లీని గుర్తించి ఫోటోలను తీసుకోవడానికి ఎగబడ్డారు. ప్రస్తుతం అందుకున్న సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.