NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్
    ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్

    Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 30, 2025
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings)పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అద్భుత విజయం సాధించింది.

    ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ తొలి ఫైనలిస్ట్‌గా నిలిచింది.

    పంజాబ్‌ నిరాశాజనక ప్రదర్శన

    మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. వారి బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఎవరూ ఇవ్వలేదు.

    ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు.

    Details

    కోహ్లీపై ఏబీ డివిలియర్స్‌ ఆశాభావం

    ఛేదనకు దిగిన ఆర్సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి 106 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే అభిమానులు ఆశించిన విధంగా స్టార్ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ కేవలం 12 పరుగులకే వెనుదిరగడం కొంత నిరాశ కలిగించింది.

    ఈ మ్యాచ్‌లో విఫలమైనా, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ మాత్రం విరాట్‌ కోహ్లీపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో పరుగులు చేయలేకపోయాడు.

    కానీ నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను, ఫైనల్‌ మ్యాచ్‌లో అతడు కీలక ఇన్నింగ్స్‌ ఆడతాడు. అతని ఆటను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు.

    Details

    ఫైనల్‌ మ్యాచ్‌పై విశ్లేషణ

    ఆర్సీబీ గతంలో కూడా టైటిల్‌ గెలిచే అవకాశం దక్కించుకున్న సందర్భాలున్నాయని గుర్తు చేసిన డివిలియర్స్‌, ''2011లో గొప్ప అవకాశం ఉండేది,

    2016 గురించి ఇప్పటికీ మాట్లాడతారు. కానీ ఇప్పుడు 2025లో ఆర్సీబీ ఫైనల్‌కి చేరింది. జూన్‌ 3న జరగబోయే తుదిపోరులో ఈసారి ట్రోఫీ ఆర్సీబీదే అవుతుంది,'' అని ధీమాగా చెప్పారు.

    హేజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ ప్రభావం

    RCB బౌలింగ్‌ యూనిట్‌ బలంగా మారిందని కూడా డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. ''జోష్‌ హేజిల్‌వుడ్‌ రాకతో బౌలింగ్‌ విభాగం పటిష్టమైంది.

    అతడు కీలక ఆటగాడు. అలాగే భువనేశ్వర్‌ కుమార్‌ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తాజా

    Virat Kohli: ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు : ఏబీ డివిలియర్స్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    vaibhav suryavanshi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదాలు అందుకున్న ఐపీఎల్‌ సంచలనం వైభవ్ సూర్యవంశీ నరేంద్ర మోదీ
    Google: ఆపిల్‌-గూగుల్‌-ఫేస్‌బుక్‌ డేటా లీక్‌! 18.4 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్?  టెక్నాలజీ
    Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు 2.10లక్షల మంది లబ్ధిదారులు ఎంపిక : పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    'కోహ్లీ రివ్యూ సిస్టమ్' సూపర్.. మైదానంలో పక్కా వ్యూహాలు విరాట్ కోహ్లీ
    IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్
    IPL 2023: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే గెలుపు రాజస్థాన్ రాయల్స్
    KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు కోల్‌కతా నైట్ రైడర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025