NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Modi-Para athletes: అంత కోపమెందుకు నవదీప్! .. భారత పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Modi-Para athletes: అంత కోపమెందుకు నవదీప్! .. భారత పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ 
    అంత కోపమెందుకు నవదీప్!

    Modi-Para athletes: అంత కోపమెందుకు నవదీప్! .. భారత పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    09:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత పారా అథ్లెట్లు పారిస్ పారాలింపిక్స్‌లో ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

    గురువారం,మోదీ తన నివాసంలో పారా అథ్లెట్లను కలిశారు.వారితో సరదాగా మాట్లాడారు.

    400మీ. టీ20 విభాగంలో కాంస్యం గెలిచిన అథ్లెట్ జీవాంజి దీప్తి,వరుసగా రెండో పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన పారా షూటర్ అవని లేఖరా,జూడోలో దేశానికి తొలి పతకం అందించిన కపిల్ పర్మార్ తదితర అథ్లెట్లను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.

    కర్నూలు జిల్లా ప్యాపిలి చెందిన పారాలింపియన్ వెంకటనారయణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    పారిస్‌లో కాంస్య పతకం సాధించిన కపిల్,తన కాంస్య పతకంపై కపిల్‌..మోదీ సంతకాన్ని తీసుకున్నాడు.

    మరుగుజ్జు జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్, ప్రధాని మోదీకి టోపీ బహూకరించారు. ఆ సమయంలో మోదీ కింద కూర్చున్నారు.

    వివరాలు 

    మీకు మాటిచ్చినట్టుగానే పసిడి గెలుచుకున్నాను: నవ్‌దీప్ 

    "త్రో విసిరిన తరువాత మీరు ఎందుకు అంత కోపంగా కనిపించారు?"అని ప్రధాని నవ్‌దీప్‌ను అడిగారు.

    "క్రితం పారాలింపిక్స్‌లో నాలుగో స్థానం వచ్చింది ,ఈసారి మీకు మాటిచ్చినట్టుగానే పసిడి గెలుచుకున్నాను..భావోద్వేగంలో అలా,"అని నవ్‌దీప్ సమాధానమిచ్చాడు.

    రెండు చేతుల్లేని పారా ఆర్చర్ శీతల్ దేవి తన కాలితో సంతకం చేసిన జెర్సీని ప్రధానికి అందించారు.

    "ప్రధానమంత్రి అంటే అందరికీ పీఎం.కానీ మాకు పీఎం అంటే పరమ్ మిత్రా(సన్నిహిత నేస్తం),"అని డిస్కస్ త్రోయర్ యోగేశ్ చెప్పారు.

    ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్ మాండవీయ,భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా తదితరులు పాల్గొన్నారు.

    పారిస్‌లో 7 స్వర్ణాలు,9 రజతాలు,13 కాంస్యాలతో కలిపి 29 పతకాలతో భారత్,పారాలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి
    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం
    Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి! అమెరికా

    నరేంద్ర మోదీ

    Narendra Modi: ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు కృషి: మోదీ భారతదేశం
    2036 Olympics: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం : మోదీ  భారతదేశం
    PM Modi on UCC: యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని మోదీ ఏం చెప్పారు..? భారతదేశం
    Narendra Modi: ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025