తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Paris Olympics 2024 : సంచలనం సృష్టించిన ఆకుల శ్రీజ.. ఫ్రీక్వార్టర్స్కు అర్హత
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Jul 31, 2024 
                    
                     05:30 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ ఒలింపిక్స్ లో ఐదో రోజు భారత్ అథ్లెట్లు సత్తా చాటారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో పివి. సింధు ఫ్రీక్వార్టర్స్ కు చేరుకుంది. ఇక పురుషుల సింగిల్స్ లోనూ లక్ష్యసేన్ సైతం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించడం విశేషం. మరోవైపు వుమెన్స్ టేబుల్ టెన్నిస్ సింగిల్స్ లో ఆకుల శ్రీజ కూడా రౌండ్ ఆప్ 16లోకి ప్రవేశించింది. ఇక విశ్వ క్రీడల్లో పాల్గొన్న తొలి ప్రయత్నంలోనే ప్రిక్వార్టర్స్కు చేరుకున్న ప్లేయర్గా రికార్డుకెక్కింది.
Details
ఫ్రీ క్వార్టర్స్ కు చేరుకున్న మనికా బత్రా
మొదటి గేమ్లో వెనుకంజలో ఉన్నా.. ఆ తర్వాత అద్భుతంగా రాణించింది. తన సమీప ప్రత్యర్థిని 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ఓడించింది. భారత్ నుంచి మరో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా కూడా ప్రీక్వార్టర్స్ కు చేరుకుంది.