NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / World Test Championship: అక్కడ గెలిస్తే అదనపు పాయింట్లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    World Test Championship: అక్కడ గెలిస్తే అదనపు పాయింట్లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు
    అక్కడ గెలిస్తే అదనపు పాయింట్లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు

    World Test Championship: అక్కడ గెలిస్తే అదనపు పాయింట్లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 21, 2025
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫార్మాట్‌లో సరికొత్త మార్పులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సిద్ధమవుతోంది.

    2025 జూన్‌లో ప్రారంభమయ్యే నాలుగో ఎడిషన్‌లో పాయింట్ల కేటాయింపు విధానంలో గణనీయమైన మార్పులు జరిగే అవకాశముంది.

    టెస్టు క్రికెట్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చే దిశగా ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

    ముఖ్యంగా విదేశీ గడ్డపై సాధించిన విజయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే విధంగా కొత్త నియమాలను అమలు చేసే యోచనలో ఉంది.

    వివరాలు 

    కొత్త సీజన్ - డబ్ల్యూటీసీ మార్పులు 

    ప్రస్తుతం జరుగుతున్న మూడో డబ్ల్యూటీసీ సైకిల్, జూన్ 11, 2025న లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది.

    ఈ ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. ప్రస్తుతం అమలులో ఉన్న పాయింట్ల వ్యవస్థ ప్రకారం, టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 12 పాయింట్లు, మ్యాచ్ టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు లభిస్తాయి.

    విజయాల శాతం ఆధారంగా జట్లకు ర్యాంకింగ్స్ కేటాయించబడతాయి.

    వివరాలు 

    పాయింట్ల వ్యవస్థలో మార్పులు 

    ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం,డబ్ల్యూటీసీ నాలుగో సీజన్‌లో ఐసీసీ పాయింట్ల కేటాయింపు విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

    ప్రధానంగా,విదేశాల్లో సాధించిన విజయాలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చే అవకాశం ఉంది.

    ఉదాహరణకు,భారత్ ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధిస్తే,అదనపు పాయింట్లను పొందేలా కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

    అంతేకాదు,భారీ తేడాతో విజయాలను సాధించిన జట్లకు అదనపు బోనస్ పాయింట్లు కేటాయించనున్నట్లు సమాచారం.

    అంటే, 10వికెట్ల తేడాతో గెలిచిన లేదా ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకున్న జట్లకు అదనపు పాయింట్లను ఇస్తారు.

    ప్రస్తుతం భారతదేశంలోని రంజీ ట్రోఫీ,ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్ వంటి టోర్నమెంట్లలో బోనస్ పాయింట్లు ఇవ్వడాన్ని అనుసరించి, డబ్ల్యూటీసీలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ఐసీసీ భావిస్తోంది.

    వివరాలు 

    హోం,అవే సిరీస్‌లలో సమతుల్యత 

    ప్రస్తుత డబ్ల్యూటీసీ ఫార్మాట్‌లో 10 జట్లు పరస్పరం అన్ని జట్లతో తలపడవు. కొద్ది జట్ల మధ్య మాత్రమే టెస్టు సిరీస్‌లు జరుగుతాయి.

    దీంతో, హోం గ్రౌండ్ అనుకూలత ఎక్కువగా ఉండటంతో, విదేశాల్లో సాధించిన విజయాలకు అధిక ప్రాముఖ్యతనిచ్చేలా ఐసీసీ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

    ఈ కొత్త పాయింట్ల వ్యవస్థపై ఏప్రిల్‌లో జరగబోయే ఐసీసీ సమావేశంలో అధికారిక చర్చ జరగనుంది.

    అన్ని జట్లకు సమాన అవకాశాలు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని ఐసీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

    ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మిగతా జట్ల కంటే ఎక్కువ టెస్టులు ఆడుతున్నాయి. అందుకే, కొత్త పాయింట్ల వ్యవస్థ ద్వారా సమతుల్యతను తీసుకురావాలని ఐసీసీ భావిస్తోంది.

    వివరాలు 

    విమర్శలు.. ప్రతిస్పందనలు 

    ప్రస్తుతం అమలులో ఉన్న డబ్ల్యూటీసీ పాయింట్ల విధానం పలు విమర్శలను ఎదుర్కొంటోంది.

    విదేశాల్లో గెలిచినా, గెలుపు తేడా ఎంత ఎక్కువైనా ఒకే విధమైన పాయింట్లు కేటాయించబడుతుండటం వివాదాస్పదంగా మారింది.

    ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఈ విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మరింత సమర్థంగా ఉండేలా పాయింట్ల వ్యవస్థను మెరుగుపర్చాలని ఇంగ్లండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    తాజా

    Pakistan: భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య.. ఆర్థిక సహాయం కోసం పంచ బ్యాంకు'ను సంప్రదించిన పాకిస్తాన్  పాకిస్థాన్
    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!  క్రికెట్
    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్ క్రికెట్
    టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..? క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025