
ZIM vs SL : రెండో టీ20లో శ్రీలంకపై జింబాబ్వే అద్భుత గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే సిరీస్ను 2-0 తేడాతో కోల్పోయినప్పటికీ, టీ20ల్లో జింబాబ్వే గట్టి పోరాటం చేస్తోంది. తొలి టీ20లో ఓడిపోయినా, రెండో మ్యాచ్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా నిలిచింది. ఇక నిర్ణాయకమైన మూడో టీ20 మ్యాచ్ ఈ రోజు (ఆదివారం, సెప్టెంబర్ 7) జరగనుంది. శనివారం హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక, జింబాబ్వే తలపడ్డాయి. టాస్ ఓడిన శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే జింబాబ్వే బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు.
Details
80 పరుగులకే ఆలౌట్
దీంతో 17.4 ఓవర్లలో 80 పరుగులకే శ్రీలంక ఆలౌటైంది. లంక తరపున కమిల్ మిషారా (20), చరిత్ అసలంక (18), దాసున్ షనక (15) మాత్రమే కొంత ప్రతిఘటించారు. మిగిలిన ఆటగాళ్లు ఒక్క అంకెల స్కోరుకే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్, సికందర్ రాజా చెరో మూడు వికెట్లు తీసి లంకను కుదిపేశారు. ముజారబానీ రెండు వికెట్లు తీశాడు.
Details
జింబాబ్వే విజయం సాధించింది
చిన్న లక్ష్యాన్ని ఛేదించడంలో జింబాబ్వే కాస్త ఇబ్బందిపడ్డా, చివరికి 14.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది. బ్యాటింగ్లో తషింగా ముసేకివా (21), ర్యాన్ బర్ల్ (20), బ్రియాన్ బెన్నెట్ (19), తాడివానాషే మారుమణి (17) ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దుష్మంత చమీర మూడు వికెట్లు తీశాడు. బినూర ఫెర్నాండో, మహేశ్ తీక్షణ చెరో వికెట్ దక్కించుకున్నారు.