NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Illegal migrants: మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 205 మంది భారతీయులు.. 
    తదుపరి వార్తా కథనం
    Illegal migrants: మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 205 మంది భారతీయులు.. 
    మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 205 మంది భారతీయులు..

    Illegal migrants: మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 205 మంది భారతీయులు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 04, 2025
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల (Illegal migrants) విషయంలో తొలి నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది.

    ఈ చర్యల నేపథ్యంలో, అక్రమంగా అమెరికా వెళ్లిన భారతీయులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపిస్తున్నారు.

    ఇప్పటికే కొన్ని గంటల క్రితం ఓ విమానం భారత్‌ కు బయల్దేరింది. అందులో 205 మంది భారతీయులు ఉన్నారని జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి.

    ఈ తరలింపుకు సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ వినియోగిస్తున్నారు.

    భారత్‌కు చేరుకోవడానికి సుమారు 24 గంటలు పట్టనుందని అంచనా.

    వివరాలు 

    భారతీయుల తొలివిడత తిరుగు ప్రయాణం

    అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అవలంభిస్తున్న విధానాలపై భారత ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది.

    తాము అక్రమ వలసలకు వ్యతిరేకమని స్పష్టం చేయడంతో పాటు, ఈ అంశం అనేక రకాల సంఘటిత నేరాల (Organized Crimes) ముడిపడి ఉందని భారత ప్రభుత్వం పేర్కొంది.

    వీసా గడువు ముగిసినా లేదా సరైన ధృవపత్రాలు లేకుండా విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత విదేశాంగ శాఖ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

    ఇదే సమయంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని సమాచారం.

    ఈ పరిస్థితుల్లో, అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల తొలివిడత తిరుగు ప్రయాణం జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు

    అమెరికా

    TikTok: అమెరికాలో టిక్‌టాక్ నిషేధం?.. ఎలాన్ చేతికి అప్పగించేందుకు చైనా వ్యూహం!  చైనా
    LOS ANGELES: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. మరోవైపు ఎమ్మీ అవార్డు చోరీ ప్రపంచం
    Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌ కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు వాయిదా హాలీవుడ్
    Los angeles Wildfires: లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. హాలీవుడ్ నటి సజీవదహనం ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025