NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్
    తదుపరి వార్తా కథనం
    TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్
    22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్

    TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    01:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌తో ఘర్షణ అనంతరం పాకిస్తాన్‌కు మరో పెద్ద సమస్య తలెత్తింది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సైనిక స్థావరాలపై తీవ్ర దాడులకు తెగబడింది.

    దీంతో పాటు బలూచిస్తాన్ ప్రాంతం నుంచీ తిరుగుబాటుదారులు సైతం పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకుపడుతున్నారు.

    తాజా దాడుల్లో మొత్తం 22 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్లు సమాచారం. వార్ అబ్జర్వర్ నివేదికల ప్రకారం, గురువారం రాత్రి దక్షిణ వజీరిస్తాన్‌లోని డాంగేట్ చెక్‌పాయింట్‌ను టిటిపి లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.

    ఈ దాడిలో ఏకంగా 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

    టిటిపి ఉగ్రవాదులు మొదట లేజర్ రైఫిల్స్‌తో ఆరుగురు సైనికులను హతమార్చి, అనంతరం తేలికపాటి ఆయుధాలతో మిగిలిన వారిపై మెరుపుదాడికి పాల్పడ్డారు.

    Details

    అదనపు బలగాలను పంపించిన పాకిస్థాన్

    ఈ దాడికి స్పందనగా మాంటోయ్ స్థావరం నుంచి పాకిస్థాన్ సైన్యం అదనపు బలగాలను పంపించింది.

    కానీ టిటిపి వారు వీరిపైనా పడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో రెండు సైనిక వాహనాలను ధ్వంసం చేశారు. టిటిపి ప్రకారం, ఈ దాడిలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

    అయితే తామొక యోధుడు ముసాబ్‌ను కోల్పోయామని వెల్లడించారు. దాడి అనంతరం టిటిపి బలగాలు ఐదు రైఫిళ్లు, ఒక రాకెట్ లాంచర్, నైట్ విజన్ పరికరాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నాయి.

    ఇదే సమయంలో బలూచ్ తిరుగుబాటుదారులు శుక్రవారం టర్బాట్, క్వెట్టా ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు.

    వీటిలో మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం క్వెట్టాలో చోటు చేసుకున్న IED పేలుడులో పది మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రపంచం

    తాజా

    TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్ పాకిస్థాన్
    No Firecrackers : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో బాణసంచాపై నిషేధం హైదరాబాద్
    Ranveer Singh : 'మా జోలికి వస్తే వదిలిపెట్టం'.. ఆపరేషన్‌ సిందూర్‌పై రణ్‌వీర్‌ సింగ్  స్పందన బాలీవుడ్
    India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ శ్రీనగర్

    పాకిస్థాన్

    Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..? ఉగ్రవాదులు
    Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం  సోషల్ మీడియా
    Indian Jets : ఐదు భారతీయ విమానాలను మట్టుబెట్టాం : పాక్ ప్రపంచం
    Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్   అంతర్జాతీయం

    ప్రపంచం

    USA:'స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టండి'... విదేశీ విద్యార్థులకు హెచ్చరిక మెయిల్స్ అమెరికా
    Cyber crime: ఆస్ట్రేలియన్ సూపర్‌పై సైబర్ దాడి.. రూ. 2.6 కోట్లు కాజేశారు! ఆస్ట్రేలియా
    US B-2 Bombers: హిందూ మహాసముద్రంలో అలజడి.. మోహరించిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు అమెరికా
    Earthquake: పపువా న్యూ గినియాలో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025