NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Gaza - Israel: గాజా హ్యుమానిటేరియన్ జోన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 40 మంది మృతి..60 మందికి గాయలు
    తదుపరి వార్తా కథనం
    Gaza - Israel: గాజా హ్యుమానిటేరియన్ జోన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 40 మంది మృతి..60 మందికి గాయలు
    గాజా హ్యుమానిటేరియన్ జోన్‌పై ఇజ్రాయిల్ దాడి

    Gaza - Israel: గాజా హ్యుమానిటేరియన్ జోన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 40 మంది మృతి..60 మందికి గాయలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 10, 2024
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ పాలస్తీనాలో ఉన్న నిరాశ్రయ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 40 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    గాజా సివిల్ డిఫెన్స్ ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడి గాజాలోని ఖాన్ యునిస్ పట్టణంలోని అల్ మవాసీ ప్రాంతంపై జరిగింది.

    ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రాంతాన్ని గతంలో సురక్షితమైనదిగా గుర్తించిందని, ఇక్కడ దాడులు జరగదని చెప్పినప్పటికీ, దాడికి పాల్పడడం గమనార్హం.

    అయితే ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాద కేంద్రంపై దాడి చేసినట్లు వివరణ ఇచ్చింది. ఈ ప్రాంతంలో దాదాపు 10,000 మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారని తెలుస్తోంది.

    వివరాలు 

    దాడిలో 20-40 టెంట్లు ధ్వంసమై, భారీ గుంతలు

    రాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో 40 మంది మరణించారని, 60 మంది గాయపడినట్లు గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహ్మద్ అల్ ముఘైర్ ప్రకటించారు.

    దాడి అనంతరం 15 మంది కనిపించకుండా పోయారని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

    హమాస్ ప్రతినిధి మహమూద్ బసల్ ఈ దాడిని హెచ్చరించకుండా జరిపారని, సహాయక చర్యలకు ఇజ్రాయెల్ దాడులు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

    దాడిలో 20-40 టెంట్లు ధ్వంసమై, భారీ గుంతలు ఏర్పడ్డాయని అన్నారు.

    వివరాలు 

    నిరాశ్రయుల కేంద్రంలో ఉగ్రవాదులు

    ఇజ్రాయెల్ కూడా ఈ దాడిని ధృవీకరించింది. ఖాన్ యునిస్‌లోని హమాస్ ఉగ్రవాదుల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌పై దాడి చేశామని, హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపింది.

    మానవత సహాయ కేంద్రాలను హమాస్ దుర్వినియోగం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది.

    అయితే హమాస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, నిరాశ్రయుల కేంద్రంలో ఉగ్రవాదులు ఉన్నారని చెప్పడం అసత్యమని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    తాజా

    Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌  సంజయ్ మల్హోత్రా
    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel : గాజా ప్రధాన ఆస్పత్రిలో పెను విషాదం.. 179 మంది సామూహిక ఖననం ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ISRAEL : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు లభ్యం.. ఇజ్రాయెల్ దళాల గాలింపులు ఇజ్రాయెల్
    Israel Hamas war: బంధీల విడుదల కోసం 5రోజుల పాటు కాల్పుల విరమణ  హమాస్
    Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల హమాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025