NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం 
    తదుపరి వార్తా కథనం
    భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం 
    భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం

    భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం 

    వ్రాసిన వారు Stalin
    Jun 24, 2023
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చారిత్రాత్మకమైన అమెరికా పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ముగించుకున్నారు.

    ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో అమెరికాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు ప్రసంగం చేశారు.

    అనంతరం మోదీ అమెరికా నుంచి ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు.

    తొలుత ట్రేడ్ సెంటర్‌లోకి మోదీ రాగానే 'భారత్ మాతా కీ జై', 'వందేమాతరం' నినాదాలు హోరెత్తాయి.

    అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ భవనంలోనే భారతదేశం పూర్తి మ్యాప్‌ కనిపిస్తోందన్నారు.

    భారతదేశం నలుమూలల నుంచి ప్రజలను తాను ఇక్కడ చూస్తున్నట్లు చెప్పారు. సమావేశ హాలును మోదీ 'మినీ ఇండియా'గా అభివర్ణించారు. తాను అమెరికాలో అపూర్వమైన ప్రేమ, ఆప్యాయతను పొందినట్లు చెప్పారు.

    మోదీ

    రక్షణ ఒప్పందాలతో అమెరికా- భారత్ మధ్య భాగస్వామ్యం సుస్థిరం: మోదీ

    రక్షణ ఒప్పందాలు అమెరికా- భారత్ మధ్య భాగస్వామ్యాన్ని సుస్థిరం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు.

    గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం సాధించిన డిజిటల్ పరివర్తన ప్రవాస భారతీయులను ఆశ్చర్యపరుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.

    గత కొన్నేళ్లుగా భారతదేశం డిజిటల్ విప్లవాన్ని చూసిన తీరు అపూర్వమైనదన్నారు.

    నేడు భారతదేశంలో ఎక్కడైనా 24/7 బ్యాంకింగ్ సేవలను పొందుతున్నారన్నారు.

    భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఆధునిక ప్రజాస్వామ్యానికి యూఎస్ ఛాంపియన్ అని మోదీ పేర్కొన్నారు. రెండు గొప్ప ప్రజాస్వామ్యాల సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు.

    మోదీ

    భారతదేశంలో పెట్టుబడులకు ఇదే ఉత్తమ సమయం: మోదీ

    భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని పెద్ద టెక్ సంస్థలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశంలో వీలైనంత ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఇదే ఉత్తమ సమయం అన్నారు.

    భారతదేశంలో ఏర్పాటు చేసిన గూగుల్ AI పరిశోధనా కేంద్రం 100 కంటే ఎక్కువ దేశాలో ఉద్యోగులతో పనిచేస్తోందన్నారు.

    భారత ప్రభుత్వ సహాయంతో హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో తమిళ్ స్టడీస్ చైర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమెరికా పురోగతిలో ప్రవాసులు కీలక పాత్ర పోషించారన్నారు.

    ఇప్పుడు భారతీయ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, దేశ వృద్ధికి సహకరించాలని మోదీ కోరారు.

    భారత్ నుంచి తీసుకున్న 100పైగా పురాతన వస్తువులను తిరిగి ఇవ్వాలని అమెరికన్ ప్రభుత్వం నిర్ణయించాడాన్ని మోదీ స్వాగతించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

    #WATCH | "In these 3 days, a new and glorious journey of India and the US relations has begun. This new journey is of our convergence on global strategic issues, of our cooperation for Make in India Make for the World. Be it technology transfer and manufacturing cooperation or… pic.twitter.com/FxD3WzktLQ

    — ANI (@ANI) June 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అమెరికా
    తాజా వార్తలు
    వాషింగ్టన్

    తాజా

    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర

    నరేంద్ర మోదీ

    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్  ప్రధాన మంత్రి
    అమెరికాలో రాహుల్ గాంధీ బిజినెస్ మీటింగ్స్...పెగాసెస్ పై సంచలన వ్యాఖ్యలు  భారతదేశం
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి

    అమెరికా

    అమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ దిల్లీ
    5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్  ఉద్యోగుల తొలగింపు
    కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ  కెనడా
    రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష  డొనాల్డ్ ట్రంప్

    తాజా వార్తలు

    మనకు తెలియకుండానే మైక్రోప్లాస్టిక్‌ కణాలను పీల్చేస్తున్నాం; అధ్యయనంలో షాకింగ్ నిజాలు పరిశోధన
    త్వరలో ట్రక్కుల్లో ఏసీ డ్రైవర్ క్యాబిన్‌లు ఏర్పాటు: నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ
    తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్; ఒక్కరోజే 11,241 మెగావాట్ల వినియోగం తెలంగాణ
    రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; పార్కుల మూసివేత  తెలంగాణ

    వాషింగ్టన్

    'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు అమెరికా
    వైట్‌హౌస్ వద్ద తెలుగు యువకుడి హల్‌చల్; అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై దాడికి ప్లాన్  అమెరికా
    వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్  అమెరికా
    వైట్‌హౌస్‌లో మోదీకి బైడెన్ దంపతుల విందు; యూఎస్ అధ్యక్షుడి ఆతిథ్యానికి ప్రధాని ఫిదా  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025