Page Loader
 Red Sea: ఎర్ర సముద్రంలో 10మంది హౌతీ మిలిటెంట్లను చంపేసిన అమెరికా
ఎర్ర సముద్రంలో రణరంగం.. 10 మంది ఇరాన్ మద్దతు హౌతీలను చంపేసిన అమెరికా

 Red Sea: ఎర్ర సముద్రంలో 10మంది హౌతీ మిలిటెంట్లను చంపేసిన అమెరికా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 01, 2024
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ నౌక వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా మెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం డెన్మార్క్ కి చెందిన ఓ కంటైనర్ షిప్ పై హౌతీ రెబల్స్ దాడులు చేసిన విషయం తెలిసిందే. అమెరికా నెవీ తన హెలికాప్టర్‌లో హైతీలు ఉన్న బోట్లపై దాడులు చేసి, నాలుగు బోట్లలో మూడు బోట్లను సముద్రంలో ముంచేసినట్లు అమెరికా కమాండ్ కంట్రోల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Details

మూడు పడవలను ముంచేసిన అమెరికా

ఈ దాడుల్లో 10 మంది హౌతీలను అమెరికా నెవీ హతమార్చినట్లు తెలుస్తోంది. అమెరికా దాడి తర్వాత గాయపడిన హౌతీలను రెస్క్యూ చేసినట్లు కొందరు తెలిపారు. మరో నలుగురు ప్రాణాలతో ఉన్నారని యెమెన్ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికా నేవీ దాడిలో 10 మంది హౌతీ తిరుగుబాటుదారులు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు సమాచారం. ఆదివారం రోజు సింగపూర్ ప్లాగ్‌తో డెన్మార్క్‌కి చెందిన కంటైనర్ షిఫ్ మార్క్స్ హాంగ్ జౌ నుంచి తాము దాడికి గురవుతున్నట్లు సందేశం వెళ్లింది. కంటైనర్ షిప్‌కి 20 మీటర్ల దూరంలో ఉన్న మూడు పడవలను ముంచేయగా, నాలుగో పడవ తప్పించుకున్నట్లు యూఎస్ నేవీ చెప్పింది.