NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మణిపూర్ బాధితులకు అమెరికా సానుభూతి, రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్ బాధితులకు అమెరికా సానుభూతి, రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు
    రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు

    మణిపూర్ బాధితులకు అమెరికా సానుభూతి, రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 24, 2023
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇద్దరు మహిళలపై జరిగిన నగ్న ఊరేగింపు, లైంగిక వేధింపులు, హత్యాచార ఘటనలను క్రూరమైన చర్యగా అభివర్ణించింది.

    ఇదో భయంకరమైన ఘటనగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు బాధితులకు అమెరికా సర్కార్ సానుభూతిని ప్రకటించింది. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

    గత రెండున్నర నెలల నుంచి కుకీ, మైతేయి వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా ఆ రాష్ట్ర హింసతో అల్లాడిపోతోంది.

    మే 4న ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై భారత ప్రజలను సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దేశవ్యాప్తంగా విమర్శలు తీవ్రమయ్యాయి.

    DETAILS

    ప్రజలను రక్షించేందుకు మానవతా కోణంలో స్పందించాలని అమెరికా సూచన

    ఊరేగింపు ఘటనలో నిందితులపై ఉక్కు పాదం మోపాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఓ మైనర్ సహా ఆరుగురిని మణిపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

    హింస కారణంగా మణిపూర్‌లో దాదాపుగా 125 మందికిపైగా మరణించారు. దాదాపు 40 వేల మందికిపైగా ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు.

    అల్లర్లను అదుపుచేసేందుకు తక్షణమే శాంతియుతమైన, సమ్మిళిత తీర్మానానికి ప్రోత్సహం అందిస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ప్రజలను రక్షించేందుకు మానవతా కోణంలో స్పందించాలని స్థానిక అధికారులను కోరుతున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు.

    మరో వైపు పార్లమెంట్ ఆవరణలో ఇప్పటికే మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని తేల్చిచెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    మణిపూర్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అమెరికా

    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే నరేంద్ర మోదీ
    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  వాణిజ్యం
    మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. వైట్‌హౌస్‌ డిన్నర్ సూపర్ అంటూ ట్వీట్ వైట్‌హౌస్
    నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం నరేంద్ర మోదీ

    మణిపూర్

    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  అమిత్ షా
    మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి  అమిత్ షా
    మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన  అమిత్ షా
    మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025