NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / చైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం
    తదుపరి వార్తా కథనం
    చైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం
    భారత్‌తో భాగస్వామ్యం కొనసాగుతుందని అమెరికా స్పష్టం

    చైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 06, 2023
    02:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. యూఎస్ రక్షణ రంగానికి చైనా సవాలుగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

    మరోవైపు భారత్‌తో తమ రక్షణ బంధం మరింత బలపడుతుందని స్పష్టం చేసింది.

    భారతదేశంతో తాము బలమైన రక్షణ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటామని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ నిర్ణయించింది. ఈ మేరకు పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ పాట్‌ రైడర్‌ ప్రకటించారు.

    డిఫెన్స్ రంగంలో భారత్‌తో తమ బంధానికి హర్షిస్తున్నామన్నారు. భవిష్యత్ లో ఈ బంధాన్ని మరింత బలపర్చుకునేందుకు దృష్టిపెట్టామన్నారు.

    ఈ రెండు దేశాలు కలిసి రానున్న రోజుల్లో ఎలా ముందడుగు వేయనున్నాయో మీరు చూస్తారని పాట్‌ పేర్కొన్నారు.

    details

    భారత్ అమెరికా రక్షణ బంధం విలువ 20 బిలియన్ డాలర్లకుపైనే

    అమెరికా రక్షణ రంగానికి చైనా ఓ సవాలుగా నిలుస్తోందని పాట్ అన్నారు.మరోవైపు 1997లో భారత్‌-అమెరికా మధ్య రక్షణ కొనుగోళ్లు చెప్పుకోదగ్గ లేవని, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 20 బిలియన్‌ డాలర్లకుపైగా రక్షణ వ్యాపారం కొనసాగుతుందన్నారు.

    ఇంకోవైపు కెనడా-భారత్‌ రగడ, ఇండో-అమెరికా సంబంధాలపై చెడు ప్రభావం చూపించాయని ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగింది.

    అయితే ఈ ప్రచారాన్ని గురువారం అమెరికా రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది.

    అమెరికా, భారత్ ప్రజల మధ్య భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాయబారి గార్సెట్టి విశేషంగా కృషి చేస్తున్నారని పాట్ ప్రశంసించారు.

    భారత్‌లోని అమెరికా మిషన్‌, ఇండియాతో అమెరికాకు ఉన్న కీలక, వ్యూహాత్మక వ్యవహారాలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్లు USA ఎంబసీ వివరించడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    రక్షణ
    భారతదేశం

    తాజా

    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం

    అమెరికా

    Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం  సనాతన ధర్మం
    బైడెన్ కోసం మూడెంచల భారీ భద్రత.. భారత రోడ్లపై పరుగులు తీయనున్న బీస్ట్ జో బైడెన్
    అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత  భారతదేశం
    నేడు దిల్లీ వేదికగా మోదీ-బైడెన్ ద్వైపాక్షిక చర్చలు భారతదేశం

    రక్షణ

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌  గణతంత్ర దినోత్సవం
    బిపోర్‌జాయ్‌ తుపాను ఎఫెక్ట్: 50 మంది సిబ్బందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ గుజరాత్
    ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?  భారతదేశం

    భారతదేశం

    G-20 సమావేశానికి భారత్ భారీ వ్య‌యం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు జీ20 సమావేశం
    జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు?  చైనా
    భారత స్టార్టప్‌లకు ఆర్థిక సాయం చేసేందుకు జేపీ మోర్గాన్ ప్లాన్  అమెరికా
    ఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025