Israel's iron dome: ఇరాన్ దాడుల వేళ యూఏఈ చేతికి ఇజ్రాయెల్ ఐరన్డోమ్..!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు అనూహ్యంగా ఒక మిత్ర దేశం అండగా నిలిచింది. అదే ఇజ్రాయెల్. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లోనే ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులు,డ్రోన్లను యూఏఈ తన ఐరన్డోమ్ వ్యవస్థల సహాయంతో అడ్డుకుంది. అయితే కొన్ని ఇరాన్ ఆయుధాలు కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో యూఏఈ మిత్ర దేశాల సహాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ముందుకు వచ్చి యూఏఈకి సహాయం అందించినట్లు అమెరికా పత్రిక సంచలన కథనాన్ని వెలువరించింది. ఇజ్రాయెల్ తన ఐరన్డోమ్ వ్యవస్థను యూఏఈకి తరలించడంతో పాటు, దాన్ని సమర్థంగా నిర్వహించేందుకు తన సైనిక దళాలను కూడా అక్కడికి పంపించింది.
వివరాలు
ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్న ఐరన్డోమ్ వ్యవస్థ
వీటి సహాయంతో రాకెట్లు, డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ దాడుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయేద్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత వెంటనే ఐరన్డోమ్ వ్యవస్థను యూఏఈకి పంపించాలని ఇజ్రాయెల్ ప్రధాని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇరాన్ దాడులకు ప్రధాన లక్ష్యంగా మారిన అబుదాబి నగరానికి కొంత ఊరట లభించింది. ఈ వ్యవస్థ సహాయంతో యూఏఈ అనేక ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది.
వివరాలు
ఐరన్డోమ్ వ్యవస్థను విదేశాలలో మోహరించడం ఇజ్రాయెల్'కు ఇదే మొదటిసారి
ఈ యుద్ధ సమయంలో ఇరాన్ మొత్తం 550 బాలిస్టిక్ క్షిపణులు, 2,200 డ్రోన్లను యూఏఈపై ప్రయోగించినట్లు అబుదాబి రక్షణ శాఖ వెల్లడించింది. ఈ పరిణామంతో ఇజ్రాయెల్, యూఏఈ దేశాల మధ్య మిత్రత్వం మరింత బలపడినట్లు అమెరికా మీడియా సంస్థ పేర్కొంది. ఇంతవరకు ఇజ్రాయెల్ తన ఐరన్డోమ్ వ్యవస్థను విదేశాలలో మోహరించడం ఇదే మొదటిసారి అని సమాచారం. ఇదే సమయంలో అమెరికా కూడా తన స్వంత గగన రక్షణ వ్యవస్థను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.