NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ
    మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ

    Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Jul 15, 2023
    10:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

    భారత్, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 సంవత్సరాల వేడుకలు వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

    'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాల్లో ఫ్రాన్స్ ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు ముఖ్య భూమికను పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

    గత 25ఏళ్ల బలమైన పునాది ఆధారంగా, రాబోయే 25 సంవత్సరాల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఇందుకోసం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు.

    ఫ్రాన్స్

    టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల కొత్త లక్ష్యాలు: మోదీ 

    భారత్‌కు చెందిన యూపీఐ(UPI)ను ఫ్రాన్స్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ ప్రకటించారు.

    పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, సైబర్, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి కొత్త లక్ష్యాలను ఇరు దేశాలు నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు.

    లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను ఎగుమతి చేసేందుకు ఇండియన్ ఆయిల్, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ కంపెనీ మధ్య దీర్ఘకాలిక ఒప్పందం స్వచ్ఛమైన ఇంధన పరివర్తన లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడుతుందని మోదీ స్పష్ట చేశారు.

    అణుశక్తిలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రధాని మోదీ చెప్పారు.

    చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించడాన్ని మోదీ ప్రశంసించారు. భారత్ మొత్త ఈ విజయంతో సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఇది భారత శాస్త్రవేత్తల గొప్ప విజయంగా మోదీ అభివర్ణించారు.

    మోదీ

    యూఏఈ పర్యటనకు మోదీ

    ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ నగరంలో కొత్త భారత కాన్సులేట్‌ను నిర్మిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.

    రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ తర్వాత యూఏఈకి వెళ్లారు. ప్రధాని మోదీకి యూఏఈలో శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఆ దేశ ప్రభుత్వం లాంఛనప్రాయ స్వాగతం పలకనుంది.

    అనంతరం ప్రధాని మోదీ యూఏఈకి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపి మధ్యాహ్నం 3.20 గంటలకు విందు భోజనానికి హాజరుకానున్నారు. సాయంత్రం 4.45 గంటలకు మోదీ దిల్లీకి బయలుదేరుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సెల్ఫీతో మోదీకి వీడ్కోలు పలికిన మాక్రాన్

    🇮🇳 🇫🇷 friends forever! https://t.co/HFYrkeG3bH

    — Narendra Modi (@narendramodi) July 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్రాన్స్
    నరేంద్ర మోదీ
    భారతదేశం

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    ఫ్రాన్స్

    సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత అంతర్జాతీయం
    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW కార్
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం ప్రపంచం

    నరేంద్ర మోదీ

    నా కొడుకు మోదీకే ఓటేస్తా.. 25 ఎకరాల పొలాన్ని కూడా ఇచ్చేస్తానన్న వందేళ్ల బామ్మ మధ్యప్రదేశ్
    మధ్యప్రదేశ్ పర్యటనలో నరేంద్ర మోదీ.. ఒకేసారి 5 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు పచ్చ జెండా  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్ వైట్‌హౌస్
    ఒకే దేశంలో రెండు చట్టాలా? ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్ మధ్యప్రదేశ్

    భారతదేశం

    2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీని 6.3శాతానికి పెంచిన ఫిచ్  వృద్ధి రేటు
    ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం యుద్ధ విమానాలు
    భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌  ఇస్రో
    టీసీఎస్‌ను కుదిపేస్తున్న ఉద్యోగాల కుంభకోణం; రూ.100 కోట్ల అక్రమార్జన టాటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025