Page Loader
Pakistan Blasts: పాకిస్థాన్ అభ్యర్థి ఎన్నికల కార్యాలయం సమీపంలో పేళ్ళులు .. 22 మంది మృతి 
పాకిస్థాన్ అభ్యర్థి ఎన్నికల కార్యాలయం సమీపంలో పేళ్ళులు

Pakistan Blasts: పాకిస్థాన్ అభ్యర్థి ఎన్నికల కార్యాలయం సమీపంలో పేళ్ళులు .. 22 మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2024
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లోని బలూచిస్థాన్‌లో ఎన్నికల అభ్యర్థుల కార్యాలయాల సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయని స్థానిక అధికారులు బుధవారం తెలిపారు. ఈ పేలుళ్లలో 22 మంది మృతి చెందారు.గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. పోలింగ్ బూత్‌ల వద్ద భద్రతను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి దాడి పిషిన్ జిల్లాలో స్వతంత్ర ఎన్నికల అభ్యర్థి కార్యాలయంలో జరిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఖిల్లా సైఫుల్లా పట్టణంలో రెండవ పేలుడు జమియాత్ ఉలేమా ఇస్లాం (JUI) కార్యాలయం సమీపంలో పేలింది. ఇది గతంలో తీవ్రవాద దాడులకు లక్ష్యంగా ఉందని ప్రావిన్స్ సమాచార మంత్రి తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండు పేలుళ్లలో 22 మంది మృతి