NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Australia : ఆస్ట్రేలియా పోర్టుకు భారీ షాక్.. వరుస సైబర్‌ దాడులతో బెంబేలు
    తదుపరి వార్తా కథనం
    Australia : ఆస్ట్రేలియా పోర్టుకు భారీ షాక్.. వరుస సైబర్‌ దాడులతో బెంబేలు
    ఆస్ట్రేలియాలో వరుస సైబర్‌ దాడులు.. మొన్న కమ్యూనికేషన్లు, నేడు ఓడరేవులు

    Australia : ఆస్ట్రేలియా పోర్టుకు భారీ షాక్.. వరుస సైబర్‌ దాడులతో బెంబేలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 13, 2023
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియాలో వరుసగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. ఈ మేరకు తీవ్రత ఎక్కువవుతోంది.ఈ క్రమంలోనే రెండో అతిపెద్ద పోర్టు ఆపరేటర్‌ డీపీ గ్లోబల్‌ ఆస్ట్రేలియా విభాగం హ్యాకర్ల బారిన పడింది.

    ఫలితంగా దాదాపు 3 రోజుల పాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. తాజాగా వాటిని పునరుద్ధరించారు.

    మరోవైపు అతిపెద్ద పోర్టు ఆపరేటర్‌ సైతం సైబర్‌ దాడికి గురైంది. ఈ సంస్థ వెబ్‌సైట్లు కొన్ని రోజుల పాటు మూతపడ్డాయని ఆస్ట్రేలియన్ ప్రభుత్వ ఆధికారులు ధ్రువీకరించారు.

    ఆస్ట్రేలియా ఎగుమతులు, దిగుమతుల్లో సుమారు 40 శాతం సరుకుల సముద్ర రవాణాను డీపీ వరల్డ్‌ సంస్థ నిర్వహిస్తోంది.

    దేశ ప్రధాన పోర్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆస్ట్రేలియన్ పోర్ట్, దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.

    details

    కీలక నెట్‌వర్క్‌ల నుంచి ఇంటర్నెట్‌ నిలిపివేత : ఆస్ట్రేలియా విభాగం

    ఈ సంస్థ ఆధీనంలోనే మెల్‌బోర్న్‌,సిడ్నీ,బ్రిస్బేన్‌,పెర్త్‌, ఫ్రెమాంట్లె ప్రధాన పోర్టుల టెర్మినల్స్ ఉన్నాయి.

    సైబర్ నేరంతో సరుకు ఎగుమతులు,దిగుమతులపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలు భారీ నౌకలు అన్‌లోడింగ్‌ కాకుండానే తీరంలో నిలిచిపోయాయి.

    ఈ నేపథ్యంలో ఉద్యోగులు, కస్టమర్లు, నెట్‌వర్క్‌ వ్యవస్థల సంరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు డీపీ గ్లోబల్‌ ఆస్ట్రేలియా విభాగం వెల్లడించింది.కీలక నెట్‌వర్క్‌ల నుంచి ఇంటర్నెట్‌ నిలిపివేశామని వివరించింది.

    తాజాగా డీపీ వరల్డ్‌ సంస్థ అన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లోకి రావడం గమనార్హం. బాధిత సంస్థ దాడుల నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు సంస్థ సైబర్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ డారెన్‌ గోల్డీ తెలిపారు.

    పోర్టుల్లో శుక్రవారమే ఇంటర్నెట్‌ వినియోగాన్ని పూర్తిగా నిలిపేశామని డీపీ వరల్డ్‌ ప్రకటించింది. అనధికారిక కార్యకలాపాల నియంత్రణ కోసమేనని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా
    సైబర్ నేరం

    తాజా

    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్
    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా
    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం

    ఆస్ట్రేలియా

    ICC: గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే!  ఐసీసీ
    తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన ఆసీస్ ఆల్‌రౌండర్.. క్రిస్ వోక్స్‌కు ఐసీసీ అవార్డు ఇంగ్లండ్
    దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ దూరం  క్రీడలు
    మూడో టీ-20లో దక్షిణాఫ్రికా చిత్తు.. క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025