English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం
    క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ..

    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    02:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి.

    భారత్ తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి సహా పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

    ఈ పరిస్థితుల నేపథ్యంలో బలూచిస్థాన్ నుంచి కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.

    బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించిన ప్రకారం, వారు పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టి, క్వెట్టా నగరాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపారు.

    ఇదే సమయంలో, పాకిస్థాన్ ఇటీవల భారత్‌లోని అనేక నగరాలపై దాడులు చేయగా, వాటిని భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

    భారత దళాలతో పాకిస్థాన్ సైన్యం యుద్ధం చేస్తున్నసమయంలోనే, బలూచ్ యోధులు క్వెట్టా ప్రాంతంలో చర్యలకు పాల్పడ్డారు.

    వివరాలు 

    కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌ను బలూచ్ యోధుల లక్ష్యం

    క్వెట్టాలో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచ్ యోధులు ముట్టడి చేశారు.

    తాజా వివరాల ప్రకారం, తిరుగుబాటుదారులు క్వెట్టా నగరంపై పూర్తి నియంత్రణ సాధించారని, అక్కడ ఉన్న పాక్ సైనికులను అక్కడి నుంచి తరిమివేశారని తెలుస్తోంది.

    క్వెట్టాలోని జంగ్లే బాగ్ ప్రాంతంలోని కాంబ్రానీ రోడ్డులో ఉన్న కెప్టెన్ సఫర్ ఖాన్ చెక్ పోస్ట్‌ను బలూచ్ యోధులు లక్ష్యంగా చేసుకున్నారు.

    అదే సమయంలో సమీపంలోని ఆరు ప్రాంతాల్లో పేలుళ్లను జరిపారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విధ్వంసకర చర్యలకు పాల్పడింది.

    జమరాన్ కట్గాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ ఆక్రమణ దళాల చెక్‌పాయింట్‌పై ఆటోమేటిక్ తుపాకులు, లాంచర్లు,బహుళ గ్రెనేడ్లతో ఘాటుగా దాడి చేశారు. ఈ దాడుల్లో వారి లక్ష్యాలను సమర్థవంతంగా చేధించగలిగారు.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    బలూచీ రేడియో భారత్‌కు మద్దతు

    ఇక పాకిస్థాన్‌లోని చమురు క్షేత్రాలను కూడా బలూచ్ యోధులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.

    ఈ దాడుల వలన అనేకమంది పాకిస్థాన్ సైనికులు, అలాగే కొంతమంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.

    ఈ దాడుల అనంతరం, పాకిస్థాన్ సైన్యం క్వెట్టా ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది.

    ఇది ఇలా ఉండగా, భారత్ పాకిస్థాన్‌పై నిర్వహిస్తున్న దాడుల విషయాన్ని బలూచీ రేడియో ప్రత్యేకంగా హైలైట్ చేస్తోంది.

    అంతేకాకుండా, బలూచీ రేడియో భారత్‌కు మద్దతు కూడా ప్రకటిస్తోంది.

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ

    The Balochistan Liberation Army has claimed that their fighters have taken control of Quetta, pushing Pakistani army out of Balochistan as the country is being surrounded on multiple front as Islamabad and Rawalpindi is escalating situation with India.#OperationSindoor2 pic.twitter.com/bmQoaUUHPu

    — News Daily 24 (@nd24_news) May 8, 2025
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' నిర్మాత ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ హరిహర వీరమల్లు
    Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు పంజాబ్
    Pakistan: సింధూ జలాల ఒప్పందంపై ఎటువంటి రాజీ లేదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌ ప్రేలాపనలు పాకిస్థాన్
    Sandeep Reddy Vanga: స్పిరిట్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్  రామ్ చరణ్

    పాకిస్థాన్

    Pakistan:పాక్‌ సైనిక విమానాలకు నేవిగేషన్‌ సిగ్నల్స్‌ అందకుండా భారత్‌ చర్యలు.. ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థలు మోహరింపు  భారతదేశం
    Hafiz Saeed: పహల్గాం దాడి తర్వాత లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు నాలుగు రెట్ల భద్రతను పెంచిన పాక్‌ ఆర్మీ  అంతర్జాతీయం
    #NewsBytesExplainer: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ యుద్ధం ఎలా చేస్తోందో తెలుసా? భారతదేశం
    Big Standoff at Attari: సొంతదేశ ప్రజల్ని అనుమతించని పాకిస్తాన్.. అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025