NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / #NewsBytesExplainer: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస.. భారత్‌తో వాణిజ్యాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస.. భారత్‌తో వాణిజ్యాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది
    బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస.. భారత్‌తో వాణిజ్యాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది

    #NewsBytesExplainer: బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస.. భారత్‌తో వాణిజ్యాన్ని ఎందుకు ప్రభావితం చేస్తుంది

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 08, 2024
    02:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. తిరుగుబాటు తర్వాత, షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

    ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

    బంగ్లాదేశ్ భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది.

    అటువంటి పరిస్థితిలో ఈ గందరగోళం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

    Details

    ముందుగా రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎంత ఉందో తెలుసుకోవాలి

    బంగ్లాదేశ్ దక్షిణాసియాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయితే, చైనా తర్వాత ఆసియాలో బంగ్లాదేశ్ రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది.

    కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య దాదాపు రూ.లక్ష కోట్ల వ్యాపారం జరిగింది.

    ఈ కాలంలో బంగ్లాదేశ్‌కు భారతదేశం చేసిన ఎగుమతులు రూ.92,000 కోట్లు కాగా, దిగుమతులు దాదాపు రూ.8,000 కోట్లు.

    అయితే గతేడాదితో పోలిస్తే వ్యాపారం తగ్గుముఖం పట్టింది.

    Details

    రెడీమేడ్ దుస్తులు దిగుమతి

    బంగ్లాదేశ్‌కు భారతదేశం కూరగాయలు, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు, చక్కెర, శుద్ధి చేసిన పెట్రోలియం, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు వాహనాలను ప్రధానంగా ఎగుమతులు చేస్తోంది

    బంగ్లాదేశ్ భారతదేశం నుండి అత్యధికంగా పత్తిని దిగుమతి చేసుకునే దేశం

    భారతదేశంలోని మొత్తం పత్తిలో 34.9 శాతం బంగ్లాదేశ్‌కు వెళుతుంది.

    బంగ్లాదేశ్ నుంచి భారత్ పెద్ద మొత్తంలో రెడీమేడ్ దుస్తులను దిగుమతి చేసుకుంటోంది.

    భారతదేశం 2024 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ నుండి రూ. 3,000 కోట్ల విలువైన దుస్తులను దిగుమతి చేసుకుంది.

    Details

     వస్త్ర దిగుమతుల్లో అగ్రగామి

    బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.

    హింస కారణంగా విదేశీ కొనుగోలుదారులు భారతదేశానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చని ఊహాగానాలు జరుగుతున్నాయి.

    అయితే, హింస చాలా కాలం పాటు కొనసాగితే మాత్రమే ఇది జరుగుతుంది.

    రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలకు వేరే మార్గం ఉండదు.

    తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి స్థిరంగా మారడంపై ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

    Details

      వ్యాపారంపై ఎంత మేరకు ప్రభావం చూపుతుంది?

    హింస కారణంగా, ఆగస్టు 5 నుండి రెండు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా మూసివేయబడింది.

    ఇది కాకుండా, భారతదేశం గత నెల రోజులుగా పత్తి లేదా నూలు ఎగుమతి చేయలేదు.

    భారతదేశం నుండి బంగ్లాదేశ్‌కు ప్రధాన వ్యవసాయ వస్తువుల ఎగుమతి ప్రస్తుతం మూసివేయబడింది.

    అయితే, ప్రస్తుతం వ్యాపారం పాక్షికంగా ప్రారంభమైంది మరియు త్వరలో పరిస్థితి సాధారణం కావచ్చు.

    అటువంటి పరిస్థితిలో, వ్యాపారంపై చాలా ప్రభావం చూపే అవకాశం చాలా తక్కువ.

    Details

    బంగ్లాదేశ్‌లో హింస ఎందుకు జరుగుతోంది?

    ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి బంగ్లాదేశ్‌లో జూన్‌ నుంచి నిరంతర నిరసనలు జరుగుతున్నాయి .

    ఆగస్టు 5 సాయంత్రం నిరసనలు హింసాత్మకంగా మారడంతో, షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి వచ్చారు.

    నిరసనల్లో ఇప్పటివరకు 469 మంది చనిపోయారు. ఆగస్టు 7వ తేదీన 29 మంది అవామీ లీగ్ కార్యకర్తల మృతదేహాలను వెలికితీశారు.

    హసీనా దేశం విడిచి వెళ్లినప్పటి నుంచి 142 మంది చనిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్
    ప్రపంచం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బంగ్లాదేశ్

    Mushfiqar Rahim: వైరైటీగా ఔటైన ముష్పికర్ రహీమ్.. అలా ఔటైన తొలి ఆటగాడిగా రికార్డు! న్యూజిలాండ్
    Soumya Sarkar: 14 ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. అదరగొట్టిన బంగ్లాదేశ్ ప్లేయర్ న్యూజిలాండ్
    Nobel laureate Muhammad Yunus: నోబెల్ గ్రహీత కు బంగ్లాదేశ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష  అంతర్జాతీయం
    Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు  పోలింగ్

    ప్రపంచం

    కెనడా కాన్సులేట్లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలు నిలిపివేత.. 17వేల వీసా దరఖాస్తులపై ప్రభావం కెనడా
    Google Alert: లక్షల జీమెయిల్ అకౌంట్లు డిలీట్.. కారణమిదే! గూగుల్
    Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..ఊగిపోయిన బిల్డింగ్స్ భూకంపం
    Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్'  నికరాగ్వా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025