LOADING...
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌ వాణిజ్య నౌకను సీజ్‌ చేసిన అమెరికా
ఇరాన్‌ వాణిజ్య నౌకను సీజ్‌ చేసిన అమెరికా

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌ వాణిజ్య నౌకను సీజ్‌ చేసిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా ముదిరాయి. ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న 'తౌస్కా' అనే భారీ వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి అనంతరం దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటన ఒమన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. అధ్యక్షుడు వివరించిన ప్రకారం,సుమారు 900 అడుగుల పొడవున్న ఈ రవాణా నౌక అమెరికా నౌకాదళం ఏర్పాటు చేసిన దిగ్బంధాన్ని దాటేందుకు ప్రయత్నించింది. అయితే అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక USS Spruance ముందుగా హెచ్చరిక కాల్పులు జరిపి దానిని అడ్డుకుంది.

వివరాలు 

ఇరాన్ తీవ్ర అభ్యంతరం

అయినప్పటికీ నౌక సిబ్బంది ఆదేశాలు పాటించకపోవడంతో, దాని యంత్రాల గది భాగంపై లక్ష్యంగా కాల్పులు జరిపి నౌకను నిలిపివేసినట్లు తెలిపారు. ఇక అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, ఇరాన్ తీర ప్రాంతానికి దూసుకెళ్తున్న నౌకను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ చర్యపై ఇరాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐఆర్‌జీసీ దళాలు అమెరికా యుద్ధ నౌకలపైకి డ్రోన్లను ప్రయోగించినట్లు ప్రభుత్వ మాధ్యమ సంస్థ Press TV తెలిపింది. ఒమన్ గల్ఫ్ సముద్ర ప్రాంతం నుంచి అమెరికా నౌకలను వెనక్కు తరిమినట్లు పేర్కొంది. అలాగే అమెరికా చర్యలను సాయుధ దోపిడీగా ఇరాన్ తీవ్రంగా ఖండించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్ పతాక నౌకపై అమెరికా దాడి

Advertisement