NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నిర్బంధించిన చైనా.. అదుపులో ముగ్గురు 
    తదుపరి వార్తా కథనం
    China: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నిర్బంధించిన చైనా.. అదుపులో ముగ్గురు 
    ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నిర్బంధించిన చైనా

    China: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నిర్బంధించిన చైనా.. అదుపులో ముగ్గురు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లపై నియంత్రణ వేస్తున్న జిన్‌పింగ్‌ సర్కారు తాజాగా మూడు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను బీజింగ్‌ అధికారులు ఆగస్టులో అరెస్ట్ చేశారని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక పేర్కొంది.

    ఈ వ్యవహారం ఆ రంగంలో కలకలం రేపుతోంది. ఈ ముగ్గురు బ్యాంకర్లలో ఒకరు, ప్రభుత్వ రంగ హైటాంగ్‌ సెక్యూరిటీస్‌కు చెందినవారు, విదేశాలకు పారిపోయారు. ఆయనను విదేశాల్లో పట్టుకుని చైనాకు తీసుకొచ్చినట్లు సమాచారం.

    గత ఏడాది చైనాలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ బావో ఫాన్‌ అదృశ్యమయ్యారు. అతడిని ఒక కేసు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

    ఇటీవల బంధించబడ్డ వారిలో షెన్‌వాన్‌ హాంగ్‌యూవాన్‌ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ వాంగ్‌ఝోపింగ్‌, గ్యూవాన్‌ సెక్యూరిటీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగం అధిపతి వాంగ్‌ చెన్‌ ఉన్నారు.

    వివరాలు 

    ఉద్యోగం నుండి రాజీనామా చేసేందుకు కూడా అనుమతి 

    హైటాంగ్‌ సెక్యూరిటీస్‌ సహా అనేక బ్రోకరేజీ సంస్థలు తమ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లకు పాస్‌పోర్టులు సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది.

    వారు వ్యక్తిగత, వృత్తిపరమైన విదేశీ పర్యటనలకు అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు.

    చివరికి, ఉద్యోగం నుండి రాజీనామా చేసేందుకు కూడా అనుమతి అవసరం అని సూచించారు.

    ఈ బ్యాంకర్లు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు, సంస్థల సిబ్బంది వారితో కలిసి ఉంటారని, ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లోనే వీరు తమ కార్యకలాపాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

    ఈ నిర్ణయాలు చైనాలో నియంత్రణ సంస్థల నుంచి ప్రైవేట్‌గా వచ్చిన ఆదేశాల ఆధారంగా తీసుకున్నట్లు సమాచారం.

    ప్రభుత్వం సంస్థల ఐపీవోలు, నిధుల సేకరణ కార్యక్రమాలను బాగా పరిశీలిస్తోందని, అవసరమైతే బ్యాంకర్లను ప్రశ్నించేందుకు పిలుస్తుందని కొన్ని సంస్థలు తెలియజేశాయి.

    వివరాలు 

    దేశీయ మార్కెట్‌ కార్యకలాపాల విలువ 1.7 ట్రిలియన్‌ డాలర్లు

    గతంలో, ప్రభుత్వ రంగ కంపెనీల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, కమ్యూనిస్టు పార్టీ అధికారులు మాత్రమే పాస్‌పోర్టులను సమర్పించేవారు.

    చైనాలో బ్రోకరేజీ పరిశ్రమ, దేశీయ మార్కెట్‌ కార్యకలాపాల విలువ 1.7 ట్రిలియన్‌ డాలర్లు గా అంచనా.

    ఈ సారి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫైనాన్షియల్‌ రంగంలోని ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని ప్రభావితం చేస్తాయని, బీజింగ్‌ లోని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ ఛాన్సన్‌ అండ్‌ కో పేర్కొంది.

    ప్రస్తుతం 147 ప్రముఖ బ్రోకరేజీ సంస్థల్లో 8,700 ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు పనిచేస్తున్నారు. వీరు ఐపీవోలు, షేర్ల విక్రయాల వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్
    Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే ! ఆపరేషన్‌ సిందూర్‌
    Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం తిరుమల తిరుపతి

    చైనా

    Arunachal Pradesh- China: అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాలకు చైనా 30 కొత్త పేర్లు..  అరుణాచల్ ప్రదేశ్
    Arunchal Padesh Row: చైనా చర్యలు అర్థ రహితం: భారత్ అరుణాచల్ ప్రదేశ్
    India vs China: సియాచిన్ సమీపంలో రహదారి నిర్మిస్తున్న చైనా.. శాటిలైట్ ఫొటోల్లో వెల్లడి  భారతదేశం
    China-Srilanka-Ariport: చైనాకు షాకిచ్చిన శ్రీలంక...భారత్​, రష్యాలకు డ్రాగన్ నిర్మించిన ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు  రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025