NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా 
    తదుపరి వార్తా కథనం
    సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా 
    సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా

    సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌ - చైనా దేశాల సరిహద్దుల్లో మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న డ్రాగన్ దేశం భారీ ఎత్తున అణ్వస్త్రాలను (న్యూక్లియర్ వార్ హెడ్స్ ను) పెంచుకున్నట్లు సమాచారం.

    అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయాలు ఇటీవలే ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఓ కీలక నివేదిక చైనా కత్తులు దూస్తున్న విషయాన్ని పేర్కొంది.

    దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పలు దేశాలు ( న్యూక్లియర్ వార్ హెడ్స్ ) అణ్వస్త్రాల సంఖ్యను పోగేసుకుంటున్నట్లు స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ( సిప్రీ ) నివేదిక వెల్లడించింది. ఈ మేరకు చైనా అణ్వస్త్ర సామర్థ్యం 350 నుంచి 410కి గణనీయంగా పెరిగినట్లు వివరించింది.

    DETAILS

     ప్రపంచ వ్యాప్తంగా వినియోగానికి 9,576 అణు ఆయుధాలు రెఢీ

    చైనా బాటలోనే మరికొన్ని దేశాలు ఈ అణ్వస్త్ర ఆయుధాలను ఆధునికీకరించుకుంటున్నాయని సిప్రీ డైరెక్టర్‌ డ్యాన్‌ స్మిత్‌ తెలిపారు. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గిన అణు ఆయుధాల సంఖ్య ఇప్పుడు మళ్లీ పెరుగుతుండటం అంతర్జాతీయ సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

    అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న తొమ్మిది దేశాలు జాబితా ఇదే :

    బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌, భారత్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌, రష్యా, అమెరికా. 2023 నాటికి ఈ అణ్వస్త్ర దేశాలన్నింటి వద్ద దాదాపుగా 12,512 అణు ఆయుధాలు ఉన్నాయని ఆయన వివరించారు.

    గతేడాది ఈ సంఖ్య 12,710గా ఉందన్నారు. అయితే వీటిలో 9,576 మాత్రమే సైనిక భాండాగారాల్లో వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    భారతదేశం

    తాజా

    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్
    Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి ఆంధ్రప్రదేశ్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్

    చైనా

    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా భారతదేశం
    చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే? కోవిడ్
    ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    భారతదేశం

    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా కలెక్టర్
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025