Page Loader
China: శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన చైనా PLA 
శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన చైనా PLA

China: శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన చైనా PLA 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా సైన్యం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించినట్లు తొలిసారి పబ్లిక్‌గా ప్రకటించింది. బుధవారం ఉదయం, పసిఫిక్ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో లక్ష్యంపై దానిని ప్రయోగించినట్లు పేర్కొంది. బీజింగ్ ఇటీవల అణ్వాయుధాల సంఖ్యను గణనీయంగా పెంచుతున్న నేపథ్యంలో ఈ పరీక్ష ఆందోళన కలిగించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఈ ఖండాంతర క్షిపణిని డమ్మీ వార్‌హెడ్‌తో అమర్చి, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:44కి ప్రయోగించింది. ఇది ముందుగా నిర్ణయించిన లక్ష్యానికి చేరుకుంది. చైనా రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది, ఇది తమ వార్షిక శిక్షణ ప్రణాళికలో సాధారణమైన అంశమని తెలిపింది.

వివరాలు 

అణు క్షిపణులు ఆధునికీకరించేందుకు చర్యలు

కొన్ని దేశాలకు తమ ఖండాంతర క్షిపణి ప్రయోగ వివరాలను ముందుగా తెలియజేయగా, పసిఫిక్ సముద్రంలో క్షిపణి ప్రయాణించిన మార్గం బీజింగ్ బహిర్గతం చేయలేదు. ఈ పరీక్ష ద్వారా తమ దళాల శిక్షణ, ఆయుధశక్తి, లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాలను విశ్లేషించడానికి ఉపయోగపడిందని పేర్కొంది. ప్రస్తుతం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ చేత బీజింగ్‌కు చెందిన సంప్రదాయ, అణు క్షిపణులు ఉన్నాయి, వాటిని ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా, అమెరికాలోని మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలను సంతరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

బీజింగ్ వద్ద దాదాపు 500 అణు వార్‌హెడ్‌లు

చైనా అణుసామర్థ్యాలు 'క్రెడిబుల్ మినిమమ్ డిటరెన్స్' స్థాయిని మించిపోయాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, డ్రాగన్ అణ్వస్త్రాల వినియోగానికి వ్యతిరేకంగా ఉందని చెబుతోంది. ప్రస్తుతం చైనా మిలటరీ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ మాత్రమే అణుదాడిని ఆమోదించే శక్తిని కలిగి ఉన్నారు. బీజింగ్ వద్ద దాదాపు 500 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని, 350 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ఐసీబీఎం) కలిగి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి అణు వార్‌హెడ్‌ల సంఖ్య 1,000 దాటవచ్చని అమెరికాలోని పెంటగాన్ అంచనా వేసింది. భూఉపరితలం పైకి ప్రయోగించే ఐసీబీఎంల కోసం చైనా ఇప్పటికే వందల సంఖ్యలో క్షిపణి ప్రయోగ బొరియలను నిర్మించడం ప్రారంభించింది.