NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China: 450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ
    తదుపరి వార్తా కథనం
    China: 450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ
    450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ

    China: 450 కిలోమీటర్ల వేగంతో చైనా కొత్త బుల్లెట్ రైలు ఆవిష్కరణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 29, 2024
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనా వరుసగా కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

    తాజాగా గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును ప్రారంభించింది. దీనిని సీఆర్‌450గా పిలుస్తారు.

    ఆదివారం బీజింగ్‌లో దీనిని పరీక్షించారు. ఈ రైలులో వినియోగించిన డిజైన్ చాలా సన్నగా, బుల్లెట్‌ షేప్‌ ముక్కతో ఉంటుంది. దీనికి అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందించే సామర్థ్యం ఉంది.

    దీనిని సాధారణ రైలు ప్రయాణంతో పోల్చితే, బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే చేరవచ్చు. ఇది గతంలో నాలుగు గంటలు తీసుకునేది.

    ప్రస్తుతం చైనాలో ఉన్న హైస్పీడ్ రైలు వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది, మొత్తం 45,000 కిలోమీటర్ల మేర విస్తరించింది.

    Details

    14వ పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టు

    ఈ ప్రాజెక్టు 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా చేపట్టారు, ఇందులో హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్‌లు, సొరంగాలు నిర్మిస్తారు. సీఆర్‌450 రైలుకు బాడీ బరువు కేవలం 10 టన్నులుగా ఉంటుంది.

    ఇది గత మోడల్ కంటే 12 శాతం తక్కువ. ఇది విద్యుత్తును కూడా 20 శాతం తక్కువగా ఉపయోగిస్తుంది. ఈ రైలు గత మోడల్ కంటే 50 కిలోమీటర్ల అదనంగా అధిక వేగంతో ప్రయాణించగలదు.

    ఇంజిన్ పరీక్షల్లో, ఈ రైలు గరిష్టంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. చైనా ఇటీవలే జె-36 అనే కొత్త యుద్ధ విమానాన్ని కూడా ఆవిష్కరించింది, ఇది ఎఫ్-35, ఎఫ్-22 రాప్టర్లకు సవాల్ విసురుతున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    ప్రపంచం

    తాజా

    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్
    China: CPECని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి కాబూల్‌తో చైనా, పాకిస్తాన్ ఒప్పందం  చైనా
    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్

    చైనా

    China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు అంతర్జాతీయం
    China: నాలుగు సరిహద్దు ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్న చైనా  ప్రపంచం
    Typhoon Bebinca: 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలమైన తుపాను.. చైనాను వణికిస్తున్న 'బెబింకా' అంతర్జాతీయం
    China: బరితెగిస్తున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌ సమీపంలో కొత్త హెలిపోర్ట్ నిర్మాణం  అరుణాచల్ ప్రదేశ్

    ప్రపంచం

    GunFire on Flight: రాజధానిలో గ్యాంగ్ వార్.. హైతీలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానంపై కాల్పులు  అంతర్జాతీయం
    Domino's: కేవలం 20 నిమిషాల్లోనే డెలవరీ.. ధ్రువీకరించిన డొమినోస్  వ్యాపారం
    Pavel Durov: టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్ దురోవ్‌ వింత ఆఫర్.. ఉచితంగా ఐవీఎఫ్‌ చికిత్స! టెలిగ్రామ్
    Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. మహిళలు, చిన్నారులు మిస్సింగ్‌తో సెర్చ్ ఆపరేషన్ మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025