NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత
    భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత

    Operation Sindoor: భారత్ దాడులతో కలకలం.. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    08:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్, పాకిస్తాన్‌పై విస్తృత స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తూ తీవ్రమైన విధ్వంసం సృష్టిస్తోంది.

    శుక్రవారం పాక్ డ్రోన్ దాడులకు గట్టి బదులుగా భారత్ శనివారం పాక్ మిలిటరీ ప్రధాన కేంద్రం రావల్పిండిని లక్ష్యంగా తీసుకుంది.

    రావల్పిండిలోని అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భారత్ భారీ స్థాయిలో దాడి చేసింది.

    ఇది మాత్రమే కాకుండా, షార్కోట్‌లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్ సమీపంలోని మురిద్ ఎయిర్ బేస్‌లపై కూడా భారత్ విరుచుకుపడింది.

    రావల్పిండితో పాటు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనూ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. భారత దాడులు రావల్పిండిలోని రెండు ప్రధాన మిలిటరీ స్థావరాలపై జరిగినట్లు తెలుస్తోంది.

    Details

    భారత్ దాడుల్ని ధ్రువీకరించిన భారత్

    భారత దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ ఈ విషయాన్ని ధృవీకరించింది. అంతేకాదు, భారత్ దాడులకు తాము ప్రతీకారం తప్పకుండా తీసుకుంటామని స్పష్టం చేసింది.

    ఇక లాహోర్, సియాల్ కోట్‌లలో కూడా భారత్ మిలిటరీ టార్గెట్లపై దాడులు నిర్వహించింది. ముఖ్యంగా లాహోర్‌లోని పాక్ ఆర్మీ డివిజన్‌ను లక్ష్యంగా తీసుకుని దాడులు చేసింది.

    ఆ డివిజన్ నుంచి సైనిక వాహనాలు బయటకు వస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.

    Details

     పాక్ ఎయిర్ బేస్‌లలోని ముఖ్యమైన సౌకర్యాలు ధ్వంసం

    "నోటమ్" జారీ చేస్తూ మద్యాహ్నం 12 గంటల వరకు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఎయిర్ స్పేస్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో అబుదాబి నుంచి పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని క్వెట్టాకు మళ్లించాల్సి వచ్చింది.

    భారత్ దాడుల్లో పాక్ ఎయిర్ బేస్‌లలోని ముఖ్యమైన సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

    ఫలితంగా పాక్ ఫైటర్ జెట్లు ఎగరలేని స్థితికి చేరుకున్నట్లు సమాచారం.

    ఈ దాడులతో భారత వైమానిక శక్తి మరోసారి తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్

    పాకిస్థాన్

    X Handle: పహల్గాం దాడి తర్వాత భారత్‌ కఠిన నిర్ణయం.. ఇమ్రాన్ ఖాన్‌, భుట్టో 'ఎక్స్' ఖాతాలు బ్లాక్‌ భారతదేశం
    Chenab Water: పాకిస్థాన్ కి చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్‌ జలాశయం గేట్లు మూసివేత.. భారతదేశం
    Fatah missile: 120 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను పేల్చగల ఫ‌త‌హ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్.. అంతర్జాతీయం
    Pakistan: ఉద్రిక్తతలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం.. ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025