NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం
    రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం

    India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 25, 2025
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌, ఇండోనేషియా తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.

    రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పర ప్రయోజనాలను అందుకునే దిశగా కలిసి ముందుకు సాగేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.

    ఈ ఒప్పందం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన సమావేశంలో కుదిరింది.

    ప్రస్తుతం సుబియాంతో మూడు రోజుల భారత్‌ పర్యటనలో ఉన్నారు.

    ఆదివారం దిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శనివారం జరిగిన సమావేశం అనంతరం ఇరుదేశాల నేతలు మీడియాతో మాట్లాడారు.

    Details

    ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇండోనేషియా భారత్‌కు కీలక భాగస్వామి అని తెలిపారు.

    ఆసియాన్‌ కూటమి 10 దేశాలపాటు ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఇండోనేషియాకు భారత్‌ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

    అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరస్పర సంబంధాలను కొనసాగించేందుకు ఇరుదేశాలు ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు.

    రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో భారత్‌, ఇండోనేషియా సంయుక్తంగా పనిచేయనున్నట్లు మోదీ వెల్లడించారు.

    ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా నౌకల పెరుగుతున్న సంచారం నేపథ్యంలో సముద్ర రక్షణను బలోపేతం చేయడానికి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

    Details

    ఫిన్‌టెక్‌, కృత్రిమ మేధ, ఐవోటీ రంగాల్లో భాగస్వామ్యం

    కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌, డిజిటల్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పరస్పర సహకారానికి ఇరుదేశాలు సిద్ధమయ్యాయి.

    ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి ఇండోనేషియా కూడా ఆసక్తి చూపుతోందని అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్పష్టం చేశారు.

    ఫిన్‌టెక్‌, ఏఐ, ఐవోటీ, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    ఇండోనేషియా

    తాజా

     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌
    PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్  చాహల్
    Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్  కమల్ హాసన్

    ఇండియా

    Happy New Year 2025: కిరిబాతి, టోంగా దీవుల్లో మొదటిసారిగా 2025 వేడుకలు ప్రారంభం ప్రపంచం
    Happy New Year: 2025లో లాంగ్‌ వీకెండ్‌లతో మీ సెలవులను ప్లాన్ చేయండి! సంవత్సరం ముగింపు 2024
    Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం ఇక లేరు శాస్త్రవేత్త
    Tamil Nadu: తమిళనాడులో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం తమిళనాడు

    ఇండోనేషియా

    ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు అంతర్జాతీయం
    కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025