LOADING...
Predicts human population: 2064 నాటికి ప్రపంచ జనాభా సగానికి తగ్గిపోతుందా..? శాస్త్రవేత్తల షాకింగ్ అంచనా
2064 నాటికి ప్రపంచ జనాభా సగానికి తగ్గిపోతుందా..? శాస్త్రవేత్తల షాకింగ్ అంచనా

Predicts human population: 2064 నాటికి ప్రపంచ జనాభా సగానికి తగ్గిపోతుందా..? శాస్త్రవేత్తల షాకింగ్ అంచనా

వ్రాసిన వారు Moogati Shabari
May 27, 2026
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంకా 40 ఏళ్లలో ప్రపంచ జనాభా భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భూమిపై సుమారు 8.3 బిలియన్ మంది ప్రజలు ఉన్నారని అంచనా. అయితే 2064 నాటికి ఈ సంఖ్య సగానికి పడిపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ సంక్షోభం, మహమ్మారి, ప్రపంచ యుద్ధ పరిస్థితులు లేదా వనరుల కొరత వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వివరాలు

వేగంగా తగ్గుతున్న ప్రపంచ జనాభా..

ఇటీవల విడుదలైన ఓ పరిశోధనా పత్రంలో భవిష్యత్తులో సంభవించవచ్చని భావిస్తున్న కొన్ని ఊహాత్మక పరిస్థితులను పరిశీలించారు. భూమి భరించగల జనాభా సామర్థ్యం ఒక్కసారిగా తగ్గిపోతే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో శాస్త్రవేత్తలు గణిత నమూనాల ఆధారంగా అంచనా వేశారు. ఇటలీలోని మిలాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మాట్లాడుతూ.. "భూమి భరించగల సామర్థ్యం అకస్మాత్తుగా రెండు బిలియన్ మందికి పడిపోయిందని భావిస్తే, ప్రపంచ జనాభా వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఆ పరిస్థితిలో 2064 నాటికి మానవ జనాభా సగానికి పడిపోవచ్చు" అని తెలిపారు.

వివరాలు

12 వేల ఏళ్ల మానవ జనాభా పెరుగుదలపై విశ్లేషణ..

అయితే ఇది నిజంగా జరగబోతుందని తాము చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇది కేవలం గణిత ఆధారిత ఊహాత్మక పరిస్థితి మాత్రమేనని, అకస్మాత్తుగా వచ్చే మార్పులు ప్రపంచ జనాభాపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికే ఈ అధ్యయనం చేశామని చెప్పారు. 'చావోస్, సొలిషన్స్ అండ్ ఫ్రాక్టల్స్' అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో గత 12 వేల ఏళ్ల మానవ జనాభా పెరుగుదలపై విశ్లేషణ చేశారు. నియోలిథిక్ యుగం నుంచి ఆధునిక కాలం వరకు జనాభా పెరుగుదల ఎలా సాగిందో అంచనా వేసేలా ప్రత్యేక గణిత సమీకరణాన్ని రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా స్థిరమైన దిశలోనే సాగుతోందని లెక్కలు చూపించాయి.

Advertisement

వివరాలు

పరిశోధకుల నివేదిక ఇదే..

అయితే అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడితే భూమి కేవలం రెండు బిలియన్ మందిని మాత్రమే భరించగలదని పరిశోధకులు పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న జనాభాలో నాలుగో వంతు మాత్రమే మిగిలే అవకాశం ఉంటుందని తెలిపారు. "భూమి భరించే సామర్థ్యంపై ఒక్కసారిగా తీవ్రమైన పరిమితులు అమలులోకి వస్తే, ప్రపంచ జనాభా వేగంగా క్షీణించే అవకాశం ఉంది" అని పరిశోధకులు తమ నివేదికలో రాశారు.

Advertisement

వివరాలు

అదుపు తప్పిన జనాభా పెరుగుదల..

ఈ పరిశోధనలో 1960లో ప్రతిపాదించిన 'డూమ్స్‌డే' సిద్ధాంతాన్ని కూడా పరిశీలించారు. ఆ సిద్ధాంతం ప్రకారం జనాభా విపరీతంగా పెరిగి, 2026 నవంబర్ 13 శుక్రవారం నాటికి మానవ జాతి అంతరించిపోతుందని అంచనా వేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గడంతో ఆ పరిస్థితిని మనుషులు తప్పించుకున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. అయినప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదుపు తప్పిన జనాభా పెరుగుదలకు సంబంధించిన గణిత నమూనాలు మళ్లీ కనిపించే అవకాశం ఉందని హెచ్చరించారు.

Advertisement