NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Earthquake: తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం.. 
    తదుపరి వార్తా కథనం
    Earthquake: తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం.. 
    తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం..

    Earthquake: తుపానులు, విద్యుత్తు అంతరాయం తర్వాత.. క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    08:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తూర్పు క్యూబాలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

    యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం బార్టోలోమ్ మాసోకు దక్షిణంగా సుమారు 25 మైళ్ళ (40 కి.మీ) దూరంలో ఉంది. శాంటియాగో డి క్యూబా వంటి పెద్ద నగరాలు కలిగిన ఈ తూర్పు ప్రాంతంలో భూకంప ప్రభావం కనిపించింది.

    ప్రాణ, ఆస్తి నష్టం సంబంధిత సమాచారం ఇంకా అందలేదు. శాంటియాగో నగర వాసులు ఈ భూకంపం వల్ల షాక్‌కు గురయ్యారు.

    76 ఏళ్ల యోలాండా టాబియో తెలిపిన వివరాల ప్రకారం,నగరంలోని ప్రజలు భయంతో వీధుల్లోకి వచ్చారు, ఇప్పటికీ కొందరు తమ ఇంటి గుమ్మాలపై కూర్చొని ఉన్నారు.

    వివరాలు 

    పశ్చిమ క్యూబాను తీవ్రంగా ప్రభావితం చేసిన తుఫాను 

    భూకంపం తర్వాత కనీసం రెండు ప్రకంపనలు కూడా వచ్చాయని, కానీ ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులెవరూ నష్టపోలేదని అన్నారు.

    ఇప్పటికే సమస్యలతో కష్టపడుతున్న క్యూబాకు ఈ భూకంపం మరో పరీక్షగా మారింది.

    బుధవారం నాడు కేటగిరీ 3 రాఫెల్ తుఫాను పశ్చిమ క్యూబాను తీవ్రంగా ప్రభావితం చేసింది.

    దీని ఫలితంగా ద్వీపం మొత్తం విద్యుత్ సప్లై ఆగిపోయింది, వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి, వేలాది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది.

    ఇంకా కొన్ని ప్రాంతాలు విద్యుత్తు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయి.

    వివరాలు 

    ద్వీపంలో నిరసనలు 

    అక్టోబర్‌లో కూడా క్యూబా తీవ్రమైన బ్లాక్‌అవుట్‌లకు గురై, కొన్ని రోజులు విద్యుత్తు లేని పరిస్థితిని ఎదుర్కొంది.

    ఈ పరిస్థితి తర్వాత పశ్చిమ భాగాన్ని ప్రభావితం చేసిన శక్తివంతమైన తుఫాను వల్ల కనీసం ఆరుగురు మరణించారు.

    ఈ కష్టసమయ పరిస్థితులు, బ్లాక్‌అవుట్‌ల కారణంగా ద్వీపంలోని ప్రజల్లో విస్తృతంగా అసంతృప్తి నెలకొంది, దీని ఫలితంగా అక్కడ చిన్న నిరసనలు వెలువడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    భూకంపం

    Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.5తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ  ఫిలిప్పీన్స్
    Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం ఆఫ్ఘనిస్తాన్
    China Earthquake: చైనాలోని గన్సులో 6.2 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, 230 మందికి గాయాలు  చైనా
    Jammu and Kashmir Earthquake: లడఖ్‌లోని లేహ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025