NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Hajj pilgrimage: హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మందికి పైగా మృత్యువాత
    తదుపరి వార్తా కథనం
    Hajj pilgrimage: హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మందికి పైగా మృత్యువాత
    హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మందికి పైగా మృత్యువాత

    Hajj pilgrimage: హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మందికి పైగా మృత్యువాత

    వ్రాసిన వారు Stalin
    Jun 24, 2024
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌదీ అరేబియాలో ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా ఇస్లామిక్ పవిత్ర స్థలాల వద్ద భక్తులు వేలాదిగా మరణించారని సౌదీ అధికారులు ఆదివారం ప్రకటించారు.

    తీవ్రమైన అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నందున 1,300మందికి పైగా మృత్యువాత పడ్డారని అధికారికంగా తెలిపారు.ఈసంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

    1,301 మరణాలలో 83శాతం మంది అనధికారిక యాత్రికులు ఉన్నారని,సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలాజెల్. తెలిపారు.

    వారి మృతికి అధిక ఉష్ణోగ్రతలు కారణం అయిందనన్నారు.కాగా మండే ఎండల్లో మత ఆచారాల ప్రకారం చాలా దూరం నడిచారని ఆయన వివరించారు.

    95మంది యాత్రికులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.వారిలో కొందరిని రాజధాని రియాద్‌లో చికిత్స కోసం విమానంలో తరలించినట్లు అల్ ఎఖ్‌బరియా టీవీకి మంత్రి చెప్పారు.

    వివరాలు 

    మృతుల్లో 660 మందికి పైగా ఈజిప్షియన్లు 

    చనిపోయిన అనేక మంది యాత్రికులకు ఎలాంటి గుర్తింపు పత్రాలు లేనందున గుర్తింపు ప్రక్రియ ఆలస్యమైందన్నారు.

    మృతులను మక్కాలో ఖననం చేశామని, ఎలాంటి విఘాతం కలగకుండా చేశామన్నారు.మరణాలలో 660 మందికి పైగా ఈజిప్షియన్లు ఉన్నారు.

    కైరోలోని ఇద్దరు అధికారుల ప్రకారం, వారిలో 31 మంది మినహా అందరూ అనధికార యాత్రికులు.

    అనధికార యాత్రికులు సౌదీ అరేబియాకు వెళ్లేందుకు సహకరించిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్స్‌లను ఈజిప్ట్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

    వివరాలు 

    బస కోసం,కాలి నడకన అనధికార యాత్రికులు 

    ఈ పరిస్థితిపై మాట్లాడిన అధికారులు,చనిపోయిన వారిలో ఎక్కువ మంది మక్కాలోని అల్-ముయిసెమ్ పరిసరాల్లోని ఎమర్జెన్సీ కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్నాయని చెప్పారు.

    ఈ ఏడాది సౌదీ అరేబియాకు ఈజిప్ట్ 50,000మందికి పైగా అధికారికంగా యాత్రికులను పంపింది.

    సౌదీ అధికారులు అనధికార యాత్రికులపై కఠినంగా వ్యవహరించి, పదివేల మందిని బహిష్కరించారు.

    కానీ చాలామంది,ఎక్కువగా ఈజిప్షియన్లు,మక్కా చుట్టుపక్కల ఉన్నపవిత్ర స్థలాలను చేరుకోగలిగారు.

    యాత్రికులకు తగిన సేవలను అందించడంలో 16 ట్రావెల్ ఏజెన్సీలు విఫలమయ్యాయని ఈజిప్టు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

    ఈ ఏజెన్సీలు మక్కాకు వెళ్లేందుకు అనుమతించని వీసాలను ఉపయోగించి సౌదీ అరేబియాకు యాత్రికుల ప్రయాణాన్ని చట్టవిరుద్ధంగా సులభతరం చేశాయని పేర్కొంది.

    కంపెనీల అధికారులను విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు పంపినట్లు ప్రభుత్వం తెలిపింది.

    వివరాలు 

    ట్రావెల్ ఏజెన్సీల కాసుల కక్కుర్తే యాత్రికుల మృతికి కారణం 

    ప్రభుత్వ యాజమాన్యంలోని అల్-అహ్రమ్ దినపత్రిక ప్రకారం,కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు,హజ్ ట్రిప్ ఆపరేటర్లు సౌదీ పర్యాటక వీసాలను ఈజిప్టు హజ్ ఆశావహులకు విక్రయించారు.

    యాత్రికుల కోసం ప్రత్యేక వీసాలు అవసరమయ్యే సౌదీ నిబంధనలను ఉల్లంఘించారు.

    ఆ ఏజెన్సీలు యాత్రికులను మక్కాలో పవిత్ర స్థలాలను మండే వేడిలో వదిలివేసినట్లు వార్తాపత్రిక తెలిపింది.

    అసోసియేటెడ్ ప్రెస్ లెక్క ప్రకారం,మరణాలలో ఇండోనేషియా నుండి 165 మంది యాత్రికులు, భారతదేశం నుండి 98 మంది,జోర్డాన్,ట్యునీషియా,మొరాకో,అల్జీరియా, మలేషియా నుండి డజన్ల కొద్దీ యాత్రికులు ఉన్నారు.

    ఇద్దరు అమెరికా పౌరులు కూడా మరణించినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సౌదీ అరేబియా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    సౌదీ అరేబియా

    ఐపీఎల్ కు చెక్ పెట్టడానికి సౌదీ ఆరేబియా లీగ్ సిద్ధం! క్రికెట్
    ఆపరేషన్ కావేరి: సూడాన్ నుంచి 10వ బ్యాచ్ భారతీయుల తరలింపు సూడాన్
    అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడానికి కారణాలేంటి?  చమురు
    భారత్‌కు సౌదీ అత్యంత వ్యూహాత్మక భాగస్మామి: ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025