NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Houthis: యెమన్‌పై భారీ వైమానిక దాడులు.. 53 మంది మృతి..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Houthis: యెమన్‌పై భారీ వైమానిక దాడులు.. 53 మంది మృతి..
    యెమన్‌పై భారీ వైమానిక దాడులు.. 53 మంది మృతి..

    Houthis: యెమన్‌పై భారీ వైమానిక దాడులు.. 53 మంది మృతి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 17, 2025
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సుమారు ఏడాదిన్నరగా హూతీ తిరుగుబాటుదారుల అదుపులో ఉన్న ఇజ్రాయెల్ నౌక "ది గెలాక్సీ లీడర్" పై అమెరికా తీవ్రంగా ప్రతిదాడికి దిగింది.

    ఈ దాడిలో నౌకలోని కమాండ్‌ పోస్టు పూర్తిగా ధ్వంసమైనట్లు సబా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

    గగనతల దాడి ద్వారా ఈ లక్ష్యాలను ఛేదించినట్లు తెలుస్తోంది. హూతీ తిరుగుబాటుదారులు 2023 నవంబర్‌లో ఈ నౌకను హైజాక్ చేశారు.

    అయితే, 25 మంది సిబ్బందిని కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు.

    వీరిలో ఫిలిప్పీన్స్, రొమానియా, బల్గేరియా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు.

    సుమారు 430 రోజులుగా ఈ నౌక యెమన్ తీరంలోని హుదెయిద్ పోర్టు వద్ద నిలిపివేయబడింది. ఈ నౌకలో ఇజ్రాయెల్‌కు చెందిన వ్యాపారవేత్త ఇబ్రహీం ఉంగర్ వాటాదారుడిగా ఉన్నట్లు సమాచారం.

    వివరాలు 

    అమెరికా విమాన వాహక నౌకపై హూతీ ప్రతిదాడి 

    అమెరికా దాడులకు ప్రతిస్పందనగా, హూతీ రెబల్స్ కూడా తీవ్ర ప్రతిదాడులకు ప్రయత్నించారు.

    సోమవారం రెండు విడతలుగా అమెరికా విమాన వాహక నౌకా సమూహంపై దాడి చేసినట్లు వెల్లడించారు.

    మొదటి దాడిలో 18 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని, ముఖ్యంగా యూఎస్‌ఎస్ హారీ ట్రూమన్, దాని అనుబంధ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.

    కొన్ని గంటల తర్వాత మరోసారి దాడి చేసినట్లు హూతీ నేతలు ప్రకటించారు. ఈ దాడుల గురించి టెలిగ్రామ్ ఛానెల్‌లో అధికారిక ప్రకటన విడుదల చేశారు.

    అమెరికాపై తమ ప్రతిదాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే, అమెరికా వర్గాలు మాత్రం హూతీలు ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను అంతరించగొట్టినట్లు ప్రకటించాయి.

    వివరాలు 

    అమెరికా దాడుల్లో 53 మంది మృతి 

    అమెరికా ఇప్పటివరకు చేసిన వైమానిక దాడుల్లో 53 మంది మరణించగా, 98 మంది గాయపడినట్లు హూతీల ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    ఈ మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు.

    ఆదివారం రాత్రి, అమెరికా యెమన్‌లో ఒక కాటన్‌ జిన్నింగ్ ఫ్యాక్టరీపై దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. "యెమన్‌లో ఆపరేషన్ కొనసాగుతోంది" అని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

    ఇక హూతీ నేత అబ్దుల్ మాలిక్ అల్ హూతీ యెమన్ ప్రజలను దేశ రక్షణ కోసం సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

    అయితే, ఐక్యరాజ్య సమితి మాత్రం ఇరువైపులా సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హౌతీ రెబెల్స్
    అమెరికా

    తాజా

    Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్ జమ్ముకశ్మీర్
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు

    హౌతీ రెబెల్స్

    Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి బ్రిటన్
    Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్ ఇరాన్
    Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు అమెరికా
    US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి..  అంతర్జాతీయం

    అమెరికా

    Jeffrey Epstein: అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం.. ప్రధాన నిందితుడి కాంటాక్ట్‌ లిస్ట్‌ జాబితా బహిర్గతం చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌  అంతర్జాతీయం
    USAID: హమాస్‌,లష్కరే గ్రూప్‌లకు యూఎస్‌ ఎయిడ్‌ నుంచి నిధులు..! అంతర్జాతీయం
    Donald Trump: మీడియా ముందే ట్రంప్‌-జెలెన్‌స్కీ మాటల యుద్ధం! డొనాల్డ్ ట్రంప్
    USAID:యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత ప్రభావం.. భారత్‌లో 5 వేల మంది వైద్య సేవలు కోల్పోయే అవకాశం! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025