Trump vs Democrats: భారత్పై 50% సుంకాలు రద్దు చేయాలి.. డెమోక్రటిక్ ఎంపీల డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్లకు వ్యతిరేకంగా అమెరికాలో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. ఈ టారిఫ్లను బహిరంగంగా విమర్శిస్తూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు డెబోరా రాస్ (నార్త్ కరోలినా), మార్క్ వీజీ (టెక్సాస్), భారతీయ మూలాల ఎంపీ రాజా కృష్ణమూర్తి (ఇల్లినాయిస్) కలిసి ఓ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. భారతీయ దిగుమతులపై 50 శాతం వరకు విధించిన టారిఫ్లను పూర్తిగా రద్దు చేయాలని ఈ ప్రతిపాదనలో వారు డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు ఎంపీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమని, అవి అమెరికా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని తీవ్రంగా విమర్శించారు.
Details
ప్రజలను అదనపు ఆర్థిక భారం పడుతోంది
చివరికి ఈ నిర్ణయాల భారాన్ని మోయాల్సి వస్తోంది సామాన్య అమెరికన్లేనని పేర్కొన్నారు. రోజువారీ అవసరాల వస్తువుల ధరలు పెరిగి, యూఎస్ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని స్పష్టం చేశారు. వాస్తవానికి ట్రంప్ ప్రభుత్వం 2025 ఆగస్టు 1న భారత్పై 25 శాతం టారిఫ్లు విధించింది. అనంతరం ఆగస్టు 27న రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25 శాతం 'సెకండరీ టారిఫ్లు'ను అమలు చేసింది. దీంతో ఇప్పటికే అమలులో ఉన్న రిసిప్రోకల్ పన్నులకు ఇవి అదనంగా చేరి, అనేక భారతీయ ఉత్పత్తులపై దిగుమతి ఖర్చులు దాదాపు రెట్టింపు అయ్యాయి.
Details
డెమోక్రటిక్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం
భారత్ ఇంకా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, ఆ మార్గంలో ఉక్రెయిన్ యుద్ధానికి మాస్కోకు నిధులు అందుతున్నాయన్న వాదనతో డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానానికి మద్దతు కూడగట్టుకున్నారు. ఈ నిర్ణయాలను అమలు చేయడానికి ఆయన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA)ను ఉపయోగించారు. అయితే ఈ చట్టాన్ని ఈ విధంగా వినియోగించడంపై డెమోక్రటిక్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డెబోరా రాస్ మాట్లాడుతూ, నార్త్ కరోలినాకు భారత్తో బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, అక్కడి భారతీయ కంపెనీలు బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయని తెలిపారు.
Details
ప్రజలపై ద్రవ్యోల్భణ భారాన్ని మోపుతున్నారు
ఇలాంటి టారిఫ్లు ఆ బలమైన బంధాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆమె హెచ్చరించారు. మార్క్ వీజీ మాట్లాడుతూ, ఈ అక్రమ టారిఫ్లు ఉత్తర టెక్సాస్లో సాధారణ ప్రజలపై ద్రవ్యోల్బణ భారాన్ని మోపుతున్నాయని ఆరోపించారు. భారత్ అమెరికాకు సాంస్కృతికంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కీలక భాగస్వామి అని ఆయన గుర్తు చేశారు. రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఈ టారిఫ్లు సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నాయని, అమెరికన్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని, చివరికి వినియోగదారుల జేబులపై భారంగా మారుతున్నాయని విమర్శించారు. టారిఫ్లను ఎత్తివేస్తే భారత్-అమెరికా మధ్య ఆర్థిక, భద్రతా సంబంధాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Details
పరిమితులను విధించాలి
ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రభుత్వం-అమెరికన్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. డెమోక్రట్స్తో పాటు కొంతమంది రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడు ట్రంప్ వినియోగిస్తున్న అత్యవసర అధికారాలకు పరిమితులు విధించాలనే అభిప్రాయంతో ఉన్నారు. వాణిజ్య విధానాలు రూపొందించే అధికారం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్కే చెందుతుందని, అధ్యక్షుడికి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ప్రవేశపెట్టారు. అక్కడ ఆమోదం లభిస్తే, సెనేట్లో కూడా ఇలాంటి బిల్లుపై ఓటింగ్ జరగనుంది. ప్రత్యేక మెజారిటీ లభిస్తే అధ్యక్షుడి వీటోను కూడా తిరస్కరించే అవకాశం ఉందని అమెరికా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.