NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA: డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం.. అమెరికాలోకి విలువైన ప్యాకేజీల పంపిణీ నిలిపివేత
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    USA: డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం.. అమెరికాలోకి విలువైన ప్యాకేజీల పంపిణీ నిలిపివేత
    డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం.. అమెరికాలోకి విలువైన ప్యాకేజీల పంపిణీ నిలిపివేత

    USA: డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం.. అమెరికాలోకి విలువైన ప్యాకేజీల పంపిణీ నిలిపివేత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 20, 2025
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలోకి అధిక విలువ గల పార్శిళ్లను డెలివరీ చేయడంపై జర్మనీకి చెందిన ప్రముఖ కొరియర్ సంస్థ డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

    800 డాలర్లకు పైగా విలువ ఉన్న ప్యాకేజీలను అమెరికాలో డెలివరీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

    ట్రంప్‌ ప్రభుత్వంలో అమలవుతున్న కఠినమైన టారిఫ్‌లు, చెకింగ్‌ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

    అయితే బిజినెస్‌ టు బిజినెస్‌ షిప్‌మెంట్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కానీ వీటిలోనూ ఆలస్యం జరగవచ్చని హెచ్చరించింది.

    గతంలో 2,500 డాలర్ల వరకు విలువైన ప్యాకేజీలను తక్కువ పేపర్ వర్క్‌తోనే అమెరికాకు పంపే అవకాశం ఉండేదని డీహెచ్‌ఎల్‌ పేర్కొంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

    Details

    డెలవరీలపై కొత్త ఆంక్షలు

    తనిఖీలు కఠినంగా మారడంతో పాటు, ఈ డెలివరీలపై కొత్త ఆంక్షలు అమలవుతున్నట్లు తెలిపింది.

    ప్రస్తుతం సంస్థ 800 డాలర్లకు తక్కువ విలువ కలిగిన ప్యాకేజీలను మాత్రమే అమెరికాకు డెలివరీ చేస్తోంది.

    అయితే వీటి విషయంలో కూడా చట్టపరమైన గ్యాప్‌లను మూసివేయాలని అమెరికా ప్రభుత్వం యత్నిస్తోంది. ముఖ్యంగా చైనా, హాంకాంగ్‌ నుంచి వచ్చే పార్శిళ్ల విషయంలో మరింత అప్రమత్తత చూపుతోంది.

    ట్రంప్‌ ప్రభుత్వం నా కొరియర్ సేవలను వినియోగించి, సింథటిక్ డ్రగ్స్‌ను అమెరికాలోకి చొరబెడుతున్నారన్న అనుమానంతో నిఘా పెంచింది.

    ఈ క్రమంలో ఒపియాడ్‌ మాదక ద్రవ్యాల పంపిణీపై నియంత్రణ విధించాలని అధికారులను ఆదేశించింది.

    Details

    డ్రగ్స్ పై కఠిన చట్టాలు

    దీనిపై స్పందించిన చైనా, ఫెంటనిల్‌ను అమెరికా సమస్యగా అభివర్ణిస్తూ, తమ దేశంలో డ్రగ్స్‌పై కఠిన చట్టాలు ఉన్నాయని పేర్కొంది.

    ఇక ఇటీవలే హాంకాంగ్‌ పోస్టు సంస్థ కూడా అమెరికాకు షిప్‌మెంట్‌లను ఏప్రిల్‌ 27 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సముద్ర మార్గంలో డెలివరీలను ఇకపై స్వీకరించమని స్పష్టం చేసింది.

    అమెరికా అకారణంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఆసియాన్‌ దేశాల మధ్య డెలివరీ వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    అమెరికా

    Asian Share Market: అమెరికా-చైనా టారిఫ్ యుద్ధం ప్రభావం.. భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు! స్టాక్ మార్కెట్
    Panama Canal: పనామా కాలువపై అమెరికా కన్ను.. చైనా ప్రభావం తుడిచివేయాలని హెగ్సెత్ ప్రకటన చైనా
    #NewsBytesExplainer: అమెరికా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్‌ సుంకాల ప్రభావం.. మాంద్యం ముప్పు నిజమేనా? డొనాల్డ్ ట్రంప్
    Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. 90 రోజుల పాటు టారిఫ్‌కు‌ బ్రేక్.. చైనాకు మాత్రం 125శాతం పెంపు! డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025