NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Trump: వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Trump: వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన 
    వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన

    Trump: వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 31, 2025
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం, చైనాపై ప్రతీకార సుంకాలను (టారిఫ్‌లు) ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    తాజాగా, ఆయన మరో కీలక ప్రకటన చేశారు. వాణిజ్య యుద్ధం కేవలం 10-15 దేశాలకే పరిమితం కాకుండా, ప్రపంచంలోని అన్ని దేశాలపైనా సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు.

    ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే ఈ చర్యలు తప్పనిసరిగా అవసరమని వ్యాఖ్యానించారు.

    వివరాలు 

     మిత్రదేశాలు కూడా శత్రువుల కంటే దారుణంగా.. 

    ''చాలా ఏళ్లుగా మేము ప్రపంచదేశాలతో ఉదారంగా వ్యవహరించాము. కానీ, చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోనివిధంగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య విధానాల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్రదేశాలు కూడా శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి. దశాబ్దాలుగా వారు మనపై విధించిన, వివిధ రూపాలలో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువ. కాబట్టి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచదేశాలన్నింటిపైనా మా వాణిజ్య టారిఫ్‌లు అమలవుతాయి'' అని ట్రంప్ ప్రకటించారు.

    వివరాలు 

    దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం

    ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే ఈ ప్రతీకార సుంకాలను తప్పించుకోవడానికి అమెరికా దిగుమతులపై టారిఫ్ తగ్గింపునకు భారత్ మొగ్గు చూపుతోంది.

    ఈ క్రమంలో, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న భారత్-అమెరికా వాణిజ్య, టారిఫ్ చర్చల్లో (India-US Tariff Talks) భారత్ ధృఢమైన వైఖరిని ప్రదర్శిస్తోంది.

    కొన్ని ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపును అంగీకరించినప్పటికీ, దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేసింది.

    ''సుంకాలు తగ్గించామంటే, అది అమెరికా ఒత్తిడికి లొంగిపోయినట్లు కాదు'' అని ఇటీవల భారత ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

    వివరాలు 

     భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2% సుంకం 

    ఇక, అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతయ్యే ఉత్పత్తులపై ఎంత సుంకాన్ని విధిస్తే, అదే తరహా ఉత్పత్తులపై సమానమైన సుంకాన్ని అమెరికాకు కూడా ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.

    ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా సగటున 2.2% సుంకం విధిస్తుండగా, అమెరికా ఉత్పత్తులపై భారత్ సగటుగా 12% సుంకాన్ని విధిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్
    Marco Rubio: శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం: మార్కో రూబియో అమెరికా
    Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు విజయనగరం
    HariHara VeeraMallu : నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి! పవన్ కళ్యాణ్

    అమెరికా

    India-US Tariffs: అమెరికా ఆల్కహాల్‌ సహా కొన్ని ఉత్పత్తులపై భారత్‌ 150శాతం సుంకాలు.. అభ్యంతరం వ్యక్తం చేసిన శ్వేతసౌధం  అంతర్జాతీయం
    #NewsBytesExplainer: అమెరికా టారిఫ్‌లపై దేశాలు ఎలా స్పందిస్తున్నాయి, భారత్ వైఖరి ఏమిటి? అంతర్జాతీయం
    American Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో చెలరేగిన మంటలు.. ప్రయాణికులు రెక్కపై నిల్చుని.. అంతర్జాతీయం
    JD Vance:'గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు అమెరికాలో ఉండే హక్కు లేదు..ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..!  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025