
Myanmar: మయన్మార్లో 3.5 తీవ్రతతో భూకంపం
ఈ వార్తాకథనం ఏంటి
మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టరు స్కేలు ప్రకారం ఈ భూకంపం తీవ్రత 3.5గా నమోదయింది. భూకంపం కేంద్రం భూలోతిలో సుమారు 25 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయినప్పటికీ, భూకంపం తక్కువ తీవ్రతగలదే కావడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం చోటు చేసుకోలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చేసిన ట్వీట్
EQ of M: 3.5, On: 26/08/2025 03:03:25 IST, Lat: 22.62 N, Long: 96.17 E, Depth: 25 Km, Location: Myanmar.
— National Center for Seismology (@NCS_Earthquake) August 25, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/GeYrnGOCWn
వివరాలు
థాయిలాండ్లోనూ ప్రకంపనలు
కాగా, ఈ ఏడాది మార్చిలో మయన్మార్ను అత్యంత శక్తిమంతమైన భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. మార్చి 28న మధ్యాహ్న సమయంలోనే భూమి 7.7, 6.3 తీవ్రతలతో భూమి కంపించింది. ఈ ప్రకంపనల కారణంగా రోడ్లు, వంతెనలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు,వేల మంది గాయపడ్డారు. భూకంప ధాటికి పొరుగున ఉన్న థాయిలాండ్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
వివరాలు
నిరాశ్రయులైన 2 లక్షల మంది ప్రజలు
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) ప్రకటన ప్రకారం, ఈ ప్రకృతి విపత్తు కారణంగా సుమారు 2 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మధ్య మయన్మార్లోని కొన్ని ప్రాంతాలు రోజూ కుదింపులకు గురవుతున్నాయి. అలాగే, భారత్-మయన్మార్ సరిహద్దుల్లో కూడా వరుసగా భూకంపాలు సంభవించాయి. జూన్ 10న 36 గంటల్లో ఆరు సార్లు భూమి కంపించినట్లు నమోదైంది. రిక్టరు స్కేలు ప్రకారం ఈ భూకంపాల తీవ్రత 3.8 నుండి 4.5 మధ్య ఉండగా, ఈ ప్రకంపనల ప్రభావంతో భారతదేశం ఈశాన్య రాష్ట్రాలు కూడా తీవ్రంగా వణికాయి.