
Earthquake: టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం
ఈ వార్తాకథనం ఏంటి
టర్కీలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రకంపనలు దేశ రాజధాని ఇస్తాంబుల్లోనూ స్పష్టంగా వచ్చినట్లు తుర్కియే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది.
భూకంప కేంద్రం ఇస్తాంబుల్కు దక్షిణ పశ్చిమ దిశగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
అయితే ఇప్పటి వరకు ఈ ప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు పేర్కొన్నారు.
ఈ భూకంప ప్రభావం తుర్కియేతో పాటు బల్గేరియా, గ్రీస్, రొమేనియా వంటి సమీప దేశాల్లోనూ నమోదైందని అధికారులు స్పష్టం చేశారు.
వివరాలు
ఇటీవల,మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భారీ భూకంపం సంభవించింది
ఇక, రెండు సంవత్సరాల క్రితమే తుర్కియేలో ఘోర భూకంపం సంభవించిందన్న సంగతి తెలిసిందే.
2023 ఫిబ్రవరిలో సంభవించిన 7.8 తీవ్రత గల భూకంపం దేశాన్ని అతలాకుతలం చేసింది. అప్పుడు దాదాపు 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రక్కనే ఉన్న సిరియాలోనూ భూమి కంపించడంతో అక్కడ సుమారు 6 వేల మంది మృతిచెందారు.
ఇటీవల మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాల నేపథ్యంలో తుర్కియేలో మళ్లీ ప్రకంపనలు నమోదు కావడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
గత భూకంపాల భయాన్ని ఇంకా మర్చిపోకముందే తాజా భూకంపంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.