NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Elon Musk: ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత పర్యటనకు వస్తా..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Elon Musk: ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత పర్యటనకు వస్తా..
    ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత పర్యటనకు వస్తా..

    Elon Musk: ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత పర్యటనకు వస్తా..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సంభాషించారు.

    ఈ ఏడాది టెస్లా భారత్‌లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వీరి మధ్య జరిగిన చర్చకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

    ప్రధాని మోడీతో చర్చించిన మరుసటి రోజు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఈ సంవత్సరం చివరలో భారత్‌కు రావాలని తనకు ఉన్న ఉత్సుకతను ఆయన వ్యక్తపరిచారు. ప్రధాని మోడీతో సంభాషించడం తనకు గర్వకారణమని మస్క్ తెలిపారు.

    ఇటీవల భారత్, అమెరికాల మధ్య సుంకాలపై చర్చలు సాగుతున్న సమయంలోనే మస్క్‌తో ప్రధాని మోడీ మాట్లాడటం గమనార్హం.

    వివరాలు 

    టెక్నాలజీ,ఆవిష్కరణల రంగాల్లో సహకార అవకాశాలపై చర్చ

    ప్రస్తుతం ఈ రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

    మోడీ, ఎలాన్ మస్క్‌ల మధ్య జరిగిన సంభాషణను ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

    టెక్నాలజీ,ఆవిష్కరణల రంగాల్లో సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

    అదేవిధంగా,ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వన్స్ భారత్ పర్యటన చేపట్టనున్నారు.

    వివరాలు 

    ముంబై నగరానికి భారీగా  టెస్లా కార్ల దిగుమతి 

    ఇదిలా ఉండగా,ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌ను కలిసిన విషయం తెలిసిందే.

    ఇదిలా ఉండగా,కొన్ని నెలల్లో టెస్లా కంపెనీ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ముంబై నగరానికి భారీగా కార్లను దిగుమతి చేయనున్నట్లు సమాచారం.

    ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో టెస్లా కార్ల విక్రయాలను ప్రారంభించాలనే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలాన్ మస్క్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఎలాన్ మస్క్

    StarLink: భారత మార్కెట్‌లోకి స్టార్‌లింక్‌ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. షరతులకు అంగీకారం  బిజినెస్
    Trump:'మా అనుమతి లేకుండా ఏమీ చేయలేరు'.. మస్క్‌కు ట్రంప్‌ క్లియర్ మెసేజ్ డొనాల్డ్ ట్రంప్
    Sam Altman-Elon Musk: ఓపెన్ఏ ఐ కొనేందుకు మస్క్ భారీ ఆఫర్.. తిరస్కరించిన సామ్ ఆల్ట్‌మాన్‌ సామ్ ఆల్ట్‌మాన్‌
    Elon Musk-Trump: మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగానికి మరిన్ని అధికారాలు.. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం  డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025