
Pakistan: పాక్లో భీకర ఆత్మాహుతి దాడి.. 16 సైనికులు మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లో దారుణమైన ఉగ్రవాద దాడి జరిగింది. తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ చేపట్టిన ఆత్మాహుతి దాడిలో 16 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్నదని అక్కడి సైనికాధికారులు తెలిపారు. ఒక ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని సైనిక కాన్వాయ్పై దూసుకెళ్లగా, ఘోర పేలుడు సంభవించింది. ఈ విపరీత దాడిలో 13 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి తరలించబడిన ముగ్గురు తీవ్రంగా గాయపడి మృతిచెందారు.
Details
24 మందికి గాయాలు
దాడిలో పౌరులు, పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సహా 24 మందికి గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతతో సమీపంలోని రెండు ఇళ్లపైకప్పులు కూలిపోయాయి. దీంతో ఆ ఇళ్లలో ఉన్న ఆరుగురు చిన్నారులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భీకర ఘటనకు తాలిబన్కి చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ బాధ్యత వహించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ దాడిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించినట్లు పాక్ సైన్యం తెలిపింది.