NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pandas: మీ పాండాలు మాకు వద్దు.. మీరే తీసుకోండి.. పాండాలను చైనాకు తిరిగి ఇచ్చిన ఫిన్నిష్ జూ
    తదుపరి వార్తా కథనం
    Pandas: మీ పాండాలు మాకు వద్దు.. మీరే తీసుకోండి.. పాండాలను చైనాకు తిరిగి ఇచ్చిన ఫిన్నిష్ జూ
    పాండాలను చైనాకు తిరిగి ఇచ్చిన ఫిన్నిష్ జూ

    Pandas: మీ పాండాలు మాకు వద్దు.. మీరే తీసుకోండి.. పాండాలను చైనాకు తిరిగి ఇచ్చిన ఫిన్నిష్ జూ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2024
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాండాలు (Pandas) చైనాలో పుట్టిన అరుదైన జాతి జంతువులు. చైనా తమ జాతీయ సంపదగా భావించే ఈ పాండాలను ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెంచుకోవడం కోసం బహుమతులుగా ఇస్తోంది.

    అంతర్జాతీయంగా ప్రతిష్ఠను పెంచుకునేందుకు చైనా ఎన్నో దేశాలకు పాండాలను అందజేస్తోంది.

    ఈ క్రమంలో దాదాపు ఆరేళ్ల క్రితం, చైనా ఫిన్లాండ్‌కు కూడా రెండు పాండాలను ఇచ్చింది.

    కానీ, పాండాల నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండటంతో, ఫిన్లాండ్ ఇప్పుడు వాటిని తిరిగి చైనాకు పంపిస్తోంది.

    వివరాలు 

    పాండాల సంరక్షణ కోసం.. ప్రతి సంవత్సరం 1.5 మిలియన్‌ యూరోల ఖర్చు 

    2018లో, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఫిన్లాండ్‌లో పర్యటించినప్పుడు, పాండాల సంరక్షణపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

    ఈ ఒప్పందం ప్రకారం, లూమీ, పిరీ అనే రెండు పాండాలను ఫిన్లాండ్‌లోని ఒక ప్రైవేట్ జూ కు అప్పగించారు.

    ఈ పాండాలను 15 సంవత్సరాల పాటు జూలో ఉంచాలని అనుకున్నారు. పాండాల కోసం అవసరమైన వాతావరణం, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు, ఆ ప్రైవేట్ కంపెనీ సుమారు 8 మిలియన్‌ యూరోలను ఖర్చు చేసింది.

    ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.74 కోట్లు అవుతుంది. ఈ ఖర్చుతో పాటు, పాండాల సంరక్షణ కోసం ప్రతి సంవత్సరం 1.5 మిలియన్‌ యూరోలను (రూ.13.8 కోట్లు) ఖర్చు చేయాల్సి వచ్చింది.

    వివరాలు 

    కోవిడ్‌ మహమ్మారి కారణంగా..

    పాండాలను ఆకర్షణగా మార్చి పర్యాటకులను ఆకర్షించాలని యోచించిన జూకు కొవిడ్‌ మహమ్మారితో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది.తీవ్ర ఆర్థిక సమస్యలు తలెత్తాయి.

    పర్యాటకుల రాక తగ్గిపోవడంతో జూ అప్పుల్లో కూరుకుపోయింది.ఫిన్లాండ్‌ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో,పాండాల నిర్వహణ భారంగా మారింది.

    ఈ పరిస్థితుల్లో,ఫిన్లాండ్‌ జూ యాజమాన్యం పాండాలను తిరిగి చైనాకు అప్పగించాలని నిర్ణయించింది. దీనిపై చైనాతో జూ యాజమాన్యం చర్చలు జరిపగా..చివరకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది.

    పాండాలను మరికొద్ది రోజుల్లో చైనాకు పంపనున్నారు. కానీ, ఆ సమయంలో వాటిని నెల రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు.

    ఇరుదేశాలు ఈ నిర్ణయం పూర్తిగా వ్యాపార సంబంధమైనదని, తమ మధ్య దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్
    Revanth Reddy: నేడు నాగర్‌ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్‌ పర్యటన రేవంత్ రెడ్డి

    చైనా

    Canada: భారతదేశాన్ని రెండవ అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొన్న కెనడా  కెనడా
    China: చైనాలో అమెరికా పౌరులపై దాడి ..పార్క్‌లో పదునైన కత్తితో  దాడులు  అమెరికా
    Bangkok to Beijing train: జులైలో బ్యాంకాక్ నుండి బీజింగ్ రైలు సర్వీసు ప్రారంభం  థాయిలాండ్
    China: చైనా 996 వర్క్ కల్చర్ ఏమిటి? అబ్బాయిలు,అమ్మాయిలు ఎందుకు పక్షుల్లా ప్రవర్తిస్తున్నారు? అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025