NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి.. 
    తదుపరి వార్తా కథనం
    US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి.. 
    ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి..

    US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2024
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎర్ర సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, యునైటెడ్ స్టేట్స్ ఆదివారం యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాలలో ఐదు దాడులు నిర్వహించినట్లు US సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది.

    ఇది శనివారం మూడు మొబైల్ యాంటీ షిప్‌ క్రూయిజ్‌ మిసైళ్లు, మానవ రహిత ఉపరితల ఓడ, మానవ రహిత జలాంతర్గామిపై దాడులను జరిపినట్లు పేర్కొంది.

    దాడులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య (స్థానిక కాలమానం ప్రకారం) జరిగాయి.

    ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు, ఇతర దేశాల మధ్య సముద్ర రవాణాకు హౌతీ తిరుగుబాటుదారుల నుంచి పెను ముప్పు పొంచి ఉంది.

    తొలిసారిగా హౌతీ రెబెల్స్ మానవరహిత జలాంతర్గాములను సైతం వాడుతున్నారు.

    Details 

    బ్రిటీష్ చమురు ట్యాంకర్‌పై హౌతీలు క్షిపణి దాడి 

    గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావంగానే ఇజ్రాయెల్‌ నౌకలపైనే దాడులు చేస్తామని మొదట ప్రకటించిన హౌతీ రెబల్స్,అయితే తరువాత ఎర్ర సముద్రం నుంచి వెళ్లే యునైటెడ్ కింగ్‌డమ్, యుఎస్‌తో పాటు ఇతర దేశాల వాణిజ్య నౌకలపైనా వరుసగా దాడులు చేస్తుండటం వల్ల ఆసియా నుంచి అమెరికా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అల్ జజీరా నివేదించింది.

    US,UK లు యెమెన్‌లోని హౌతీల లక్ష్యాలను అనేకసార్లు చేధించడం ద్వారా ప్రతిస్పందించాయి. హౌతీ దాడులను విచక్షణారహితంగా, ప్రపంచ వాణిజ్యానికి ముప్పుగా వారు అభివర్ణించారు.

    అంతకుముందు శనివారం,బ్రిటీష్ చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడికి హౌతీలు బాధ్యత వహించారు.

    ఇది భారతదేశానికి ముడి చమురును తీసుకువెళుతున్న పనామా జెండాతో కూడిన నౌకగా యుఎస్ గుర్తించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హౌతీ రెబెల్స్

    తాజా

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్

    హౌతీ రెబెల్స్

    Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి అమెరికా
    Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్ ఇరాన్
    Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025