NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Russia-Ukraine: ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. మాస్కోలో 4 విమానాశ్రయాల మూసివేత! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Russia-Ukraine: ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. మాస్కోలో 4 విమానాశ్రయాల మూసివేత! 
    ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. మాస్కోలో 4 విమానాశ్రయాల మూసివేత!

    Russia-Ukraine: ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. మాస్కోలో 4 విమానాశ్రయాల మూసివేత! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    04:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా తీవ్రంగా కృషి చేస్తున్నా,రెండు దేశాల మధ్య పరస్పర దాడులు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయి.

    ఉక్రెయిన్‌పై రష్యా భారీ స్థాయిలో దాడులకు పాల్పడటంతో, కీవ్‌ తనవంతు ప్రతీకార చర్యలకు దిగుతోంది.

    ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్‌ 100కు పైగా డ్రోన్లను ఉపయోగించి మాస్కోలోని ఒక డజను కంటే ఎక్కువ ప్రాంతాలపై విరుచుకుపడింది.

    అయితే పలు డ్రోన్లను తాము సమర్థవంతంగా కూల్చివేశామని రష్యా ప్రభుత్వం తెలిపింది.

    మాస్కో సమీపంలోని నాలుగు విమానాశ్రయాలు ఈ దాడుల ప్రభావంతో తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    వివరాలు 

    మాస్కో బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులకు గాయాలు 

    ఇక మాస్కో ప్రధాన ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా మరో తొమ్మిది ప్రాంతీయ విమానాశ్రయాలకు స్వల్ప నష్టం కలిగిందని, అందువల్ల వాటిని కూడా మూసివేశామని రష్యా పౌర విమానయాన విభాగమైన రోసావియాట్సియా (Rosaviatsia) వెల్లడించింది.

    ఇంతలో రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉక్రెయిన్‌ నగరమైన ఖార్కివ్‌ పై రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లతో దాడి జరిపాయి.

    ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. అంతేకాకుండా సుమారు 100 మార్కెట్‌ స్టాళ్లు నాశనమయ్యాయని సమాచారం.

    మరోవైపు మాస్కో బాంబు దాడుల్లో ఏడుగురు పౌరులు గాయపడినట్లు అక్కడి స్థానిక అధికారులు తెలియజేశారు.

    వివరాలు 

    'విక్టరీ డే' వేడుకలకు ప్రపంచ దేశాల నాయకులు

    ఈ యుద్ధ పరిస్థితుల నడుమ,రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునే 'విక్టరీ డే' 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని,మే 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది.

    ఇక ఇటలీలోని వాటికన్ నగరంలో పోప్ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల సందర్బంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్‌ జెలెన్స్కీ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మధ్య శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే.

    ఈ చర్చల అనంతరం మాస్కో తన నిర్ణయాన్ని వెల్లడించింది.

    ఈ 'విక్టరీ డే' వేడుకలకు ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకారం, ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    తాజా

    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    Rahul Gandi: రాహుల్‌ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ.. నాన్‌ బెయిల్‌బుల్ వారెంట్ జారీ  రాహుల్ గాంధీ
    Bhadradri Seetharam: భద్రాద్రి సీతారాముల ఫొటోలకు అధికారిక కాపీ రైట్స్ భద్రాచలం

    ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు జపాన్
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన జో బైడెన్
    'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా రష్యా
    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025