NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan attacks Iran: బలూచిస్తాన్ గ్రూపులే లక్ష్యంగా.. ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు.. 
    తదుపరి వార్తా కథనం
    Pakistan attacks Iran: బలూచిస్తాన్ గ్రూపులే లక్ష్యంగా.. ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు.. 
    బలూచిస్తాన్ గ్రూపులే లక్ష్యంగా.. ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు..

    Pakistan attacks Iran: బలూచిస్తాన్ గ్రూపులే లక్ష్యంగా.. ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 18, 2024
    11:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బలూచిస్తాన్‌లో ఇరాన్ ఘోరమైన క్షిపణి,డ్రోన్ దాడి తరువాత, పాకిస్థాన్ ఇరాన్ భూభాగంలోని మిలిటెంట్ లక్ష్యాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు పలు పాకిస్థానీ వర్గాలు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

    బలూచిస్థాన్‌లోని 'జైష్‌ అల్‌ అదిల్‌' మిలిటెంటు గ్రూపునకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్‌ దాడి చేసిన ఒక రోజు వ్యవధిలోనే పాక్‌ ప్రతిస్పందించడం గమనార్హం.

    బలూచిస్థాన్‌లో ఇద్దరు చిన్నారులు మరణించగా, మరో ముగ్గురికి గాయాలైన ఫలితంగా తమ భూభాగంపై క్షిపణి, డ్రోన్ దాడి చేసినందుకు ఇరాన్‌ను పాకిస్థాన్ బుధవారం ఖండించింది.

    పాకిస్థాన్ ప్రభుత్వం ఈ దాడిని తమ దేశ గగనతల హక్కులను ఉల్లంఘిస్తూ, సౌర్వభౌమాధికారాన్ని సవాలు చేశారని అభివర్ణించింది. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.

    Details 

    ద్వైపాక్షిక పర్యటనలను ఉపసంహరించుకున్న పాక్ 

    మంగళవారం జరిగిన ఇరాన్ ఆపరేషన్‌ను టెహ్రాన్ విదేశాంగ మంత్రి అంగీకరించారు.

    ఇరాన్ ఉగ్రవాద సంస్థగా పరిగణించే జైష్ అల్-అద్ల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొన్నారు.

    జైష్ ఉల్-అడ్ల్, లేదా"ఆర్మీ ఆఫ్ జస్టిస్"అనేది 2012లో స్థాపించబడిన సున్నీ మిలిటెంట్ గ్రూప్, ఇది ఎక్కువగా పాకిస్తాన్ సరిహద్దులో పనిచేస్తుంది.

    ఇస్లామాబాద్ ప్రతిస్పందనగా ఇరాన్‌లోని తన రాయబారిని రీకాల్ చేయడం,ప్రస్తుతం స్వదేశంలో ఉన్న పాక్‌లోని ఇరాన్‌ రాయబారిని ఇప్పుడే తిరిగి రావొద్దని సూచించింది.

    దీంతోపాటు భవిష్యత్తులో జరగబోయే అన్ని ద్వైపాక్షిక పర్యటనలను ఉపసంహరించుకుంది.

    ఇరాక్,సిరియాలోని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ముందస్తు దాడులతో,ఈ ప్రాంతంలో ఇరాన్ సైనిక చర్యల నేపథ్యంలో బలూచిస్తాన్‌లో ఈ సంఘటన జరిగింది.

    వైమానిక దాడి తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ హెచ్చరించింది.

    Details 

    మిలిటెంట్ గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఇరు దేశాలపై ఆరోపణలు 

    అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముంతాజ్ బలోచ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

    రెండు దేశాల మధ్య బహుళ కమ్యూనికేషన్ మార్గాలను ఏర్పాటు చేసినప్పటికీ దాడి జరిగిందని పేర్కొన్నారు.

    సరిహద్దు దాడులను ప్రారంభించే మిలిటెంట్ గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఇరు దేశాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

    భాగస్వామ్య సరిహద్దు, దాదాపు 900 కి.మీ విస్తరించి, ఇస్లామాబాద్,టెహ్రాన్ రెండింటికీ చాలా కాలంగా భద్రతాపరమైన ఆందోళనలకు మూలంగా ఉంది.

    ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని సబ్జ్ కోహ్ గ్రామం సమీపంలో ఇటీవల జరిగిన స్ట్రైక్ ఇప్పుడు ఇరాన్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలలో ఈ ఉద్రిక్తతలను తెరపైకి తెచ్చింది.

    Details 

    పాక్,ఇరాన్ సంయమనం పాటించాలని చైనా పిలుపు 

    ఘోరమైన స్ట్రైక్ తర్వాత కొనసాగుతున్న తమ సంఘర్షణను నిర్వహించడంలో సంయమనం పాటించాలని చైనా బుధవారం రెండు దేశాలకు పిలుపునిచ్చింది.

    చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ "ఉద్రిక్తతను పెంచడానికి దారితీసే చర్యలను నివారించాలని, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి కలిసి పనిచేయాలని" కోరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ఇరాన్

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    పాకిస్థాన్

    KL Rahul: 107 బంతుల్లో 66 పరుగులా.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయాబ్ మాలిక్ విమర్శలు కేఎల్ రాహుల్
    Pakistan team: ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన.. పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు క్రికెట్
    Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై జైలు విచారణ చట్టవిరుద్ధం: నయీమ్ పంజుతా  ఇమ్రాన్ ఖాన్
    Abdul Razak: 'క్రికెట్ గెలిచింది. భారత్ ఓడిపోయింది'.. మరోసారి భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్ టీమిండియా

    ఇరాన్

    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి ప్రపంచం
    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం విద్యార్థులు
    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025