NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే
    తదుపరి వార్తా కథనం
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే

    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే

    వ్రాసిన వారు Stalin
    Jun 23, 2023
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో చారిత్రక ప్రసంగం చేశారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. ఒక భారత అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మొదటిసారి జూన్ 2016లో మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగంలోని హైలెట్స్‌ను ఓసారి పరిశీలిద్దాం.

    యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించడం ఎల్లప్పుడూ గొప్ప గౌరవంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. తనకు రెండుసార్లు అవకాశం దక్కిందన్నారు.

    భారతదేశం- అమెరికా మధ్య స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలనే ఆకాంక్ష ఉందని మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) యుగంలో మరొక AI (అమెరికా-ఇండియా) మరింత అభివృద్ధిని చూసిందన్నారు.

    మోదీ

    ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన రాడికలిజం, ఉగ్రవాదం 

    అమెరికాలో 9/11, ముంబైలో 26/11 దాడుల గురించి కూడా మోదీ ప్రస్తావించారు.

    రాడికలిజం, ఉగ్రవాదం ఇప్పటికీ మొత్తం ప్రపంచానికి ప్రమాదకరంగా ఉన్నాయని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో 'ఇఫ్స్ లేదా బట్స్' ఉండవన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    రాడికలిజం, ఉగ్రవాదం సిద్ధాంతాలు కొత్త రూపును మార్చుకున్నా వాటి ఆశయాలు ఒకటేనని చెప్పుకొచ్చారు.

    ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దాన్ని నియంత్రించడంలో ఎలాంటి అపోహలు ఉండొద్దన్నారు.

    ఉక్రెయిన్ వివాదంతో ఐరోపాలో మళ్లీ యుద్ధం రాజుకుందని మోదీ అన్నారు. ఈ యద్ధం ఆ ప్రాంతాన్ని తీవ్ర అలజడిని రేపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పినట్లుగా ఇది యుద్ధ యుగం, దౌత్య యుగమని మరోసారి మోదీ నొక్కి చెప్పారు.

    మోదీ

    త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 

    ప్రధాని మోదీ భారత ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. 2014లో ప్రధాని హోదాలో తాను తొలిసారి అమెరికాను సందర్శించినప్పుడు భారత్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని చెప్పారు.

    ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ అన్నారు.

    భారతదేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ జనాభాలో ఆరోవంతు తాము ఉండటమే దానికి కారణమని మోదీ చెప్పారు.

    మహిళా సాధికారత గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఆధునిక భారతదేశంలో మహిళలు మంచి భవిష్యత్తు వైపు వెళ్తున్నారన్నారు. మహిళలు ప్రగతి పథంలో నడిపించడం వల్లే సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు.

    మోదీ

    వేలాది మాండలికాలు ఉన్నా మా స్వరం ఒకటే: మోదీ

    ప్రధాని తన ప్రసంగంలో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

    ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విషయంలో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మోదీ సమర్థించారు.

    ప్రజాస్వామ్యం భారతదేశ ఆత్మ అన్నారు. తమ నరనరాల్లో ప్రజాస్వామ్యమే ప్రవరిస్తోందన్నారు.

    మైనారిటీల పట్ల ఎలాంటి వివక్ష లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తమ దేశంలో 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయని, అయితే అందరం ఒకే స్వరంలో మాట్లాడుతున్నామని, ఒకటిగానే ఉన్నామని చెప్పారు.

    ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు భారత్ నిలయమని, అన్ని వేడుకలను జరుపుకుంటామని పేర్కొన్నారు.

    తమ జీవన విధానంలో ఎంతో వైవిధ్యం ఉంటుందని మోదీ చెప్పారు. తన పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం కుంటుపడిందన్న ఆరోపణలను మోదీ ఖండించారు.

    మోదీ

    అమెరికా మాకు ముఖ్యమైన రక్షణ భాగస్వామి: మోదీ

    అమెరికా నేడు తమ అత్యంత ముఖ్యమైన రక్షణ భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా మోదీ పేర్కొన్నారు.

    భారతదేశం-అమెరికా దేశాలు అంతరిక్షం, సముద్రాలు, సైన్స్, సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు, టెక్, వాణిజ్యం, వ్యవసాయం, ఫైనాన్స్‌, కళ, కృత్రిమ మేథస్సులో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.

    పారిస్ ఒప్పందాన్ని నెరవేర్చిన ఏకైక జీ20 దేశంగా తాము అవతరించినట్లు మోదీ పేర్కొన్నారు.

    'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

    150 మిలియన్లకు పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి తమ ప్రభుత్వం దాదాపు 40 మిలియన్ల ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సంఖ్య ఆస్ట్రేలియా జనాభాకు దాదాపు 6 రెట్లు ఎక్కువని చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తున్న ప్రధాన మోదీ

    #WATCH | Our vision is 'Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayaas'. We are focussing on infrastructure developments. We have given nearly 40 million homes to provide shelter to over 150 million people, which is nearly 6 times the population of Australia: Prime… pic.twitter.com/e6EFjlPity

    — ANI (@ANI) June 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    అమెరికా
    తాజా వార్తలు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    నరేంద్ర మోదీ

    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? దిల్లీ
    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ

    ప్రధాన మంత్రి

    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు సుప్రీంకోర్టు
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల నరేంద్ర మోదీ
    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్

    అమెరికా

    గ్లోబల్ బిలియనీర్స్ : టాప్ 20 మహిళా కుబేరులు వీరే !  మహిళ
    భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం: వైట్ హౌస్  వైట్‌హౌస్
    చిట్టి ఎలాన్ మస్క్ లుక్ అదుర్స్.. నెట్టింట సందడి చేస్తున్న ఏఐ ఫోటో ట్విట్టర్
    అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని కాంగ్రెస్

    తాజా వార్తలు

    దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం  మన్‌సుఖ్ మాండవీయ
    వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు నరేంద్ర మోదీ
    తమిళనాడులో భారీ వర్షాలు; పాఠశాలలు మూసివేత తమిళనాడు
    తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025