NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'
    అంతర్జాతీయం

    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'

    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 21, 2023, 11:23 am 0 నిమి చదవండి
    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'
    'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీ సెల్సియస్ దాటుతోంది, మేలుకోకుంటే ఉపద్రవమే'

    గ్లోబల్ వార్మింగ్‌(ఉపరితల ఉష్ణోగ్రతలు)పై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. వాతావరణ మార్పులపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఐపీసీసీ పెంపొందిస్తుంది. 2030ల ప్రారంభంలో ప్రపంచం 1.5డిగ్రీ సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ పరిమితిని దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులకు కారణమయ్యే వినాశక పరిణామాలు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతున్నాయని హెచ్చరించింది. ఈ దశాబ్దాన్ని మానవ చరిత్రలో కీలకంగా చెప్పుకున్న నేపథ్యంలో ఉపరితల వేడిని తగ్గించే చర్యలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని ఐపీసీసీ కోరింది. వాతావరణ మార్పుల అంశం రాబోయే సంవత్సరాల్లో తీవ్రమైన రాజకీయ, ఆర్థిక చర్చలకు ఆధారం అవుతాయని ఐపీసీసీ చెప్పింది.

    పరిస్థితి ఇంకా చేయి దాటిపోలేదు: ఐపీసీసీ

    వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదని ఐపీసీసీ చెప్పింది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మేల్కొని ఉద్గారాలు తగ్గింపుపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చింది. భవిష్యత్‌ను దృష్టింలో ఉంచుకొని అన్ని రంగాల్లో స్థిరమైన ఉద్గారాల తగ్గింపులను సాధించడానికి పాటుపడాలని ఐపీసీసీ వెల్లడించింది. వాతావరణ విపత్తును నిరోధించడానికి సాధనాలు ఉన్నప్పటికీ, వాటిని అనేక దేశాలు ఉపయోగించుకోవడం ఐపీసీసీ చెప్పుకొచ్చింది. దీన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించింది. 2018నుంచి గ్లోబల్ వాతావరణ నివేదికలను పరిశీలించిన తర్వాత తాము ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పింది. 1.5డిగ్రీ సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ పరిమితి దాటితే పంటలపై ప్రభావం పడుతుందని, జీవవైవిధ్యంలో మార్పులు వస్తాయని, మంచుకొండలు కరిగిపోతాయని, సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, ఇలా అనేక చెడు పరిణామాలు జరుగుతాయని పేర్కొంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ప్రపంచం
    ఐక్యరాజ్య సమితి

    ప్రపంచం

    2,000 ఏళ్ల నాటి కంప్యూటర్.. అవాక్కైన శాస్త్రవేత్తలు! పరిశోధన
    మైఖేల్ జోర్డాన్ జెర్సీ వేలానికి రికార్డు స్థాయిలో ధర బాస్కెట్ బాల్
    హైదరాబాద్‌లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు హైదరాబాద్
    ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్  స్టాక్ మార్కెట్

    ఐక్యరాజ్య సమితి

    వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ  ఉష్ణోగ్రతలు
    కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం సింగపూర్
    హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి హైదరాబాద్
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023