మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్లో కాల్పులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
2023 ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ముంగిట న్యూజిలాండ్ ఉలిక్కిపడింది. ఈ మేరకు మరికొన్ని గంటల్లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో కాల్పుల కలకలం రేగింది. ఘటనలో ఇద్దరు వ్యక్తలు మృతి చెందినట్లు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ ప్రకటించారు. మరో ఆరుగురు గాయపడ్డారని వెల్లడించారు. ఓ దుండగుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి చొరబడ్డాడు. దీంతో ఇరువురి మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.ఘటనలో దుండగుడు సహా ఓ పోలీస్ అధికారి మరణించారు. ఈసారి ఫిఫా టోర్నమెంట్ ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడెన్ పార్క్ వేదికగా కివిస్ తో నార్వే జట్టు తలపడనున్న కొద్ది గంటల ముందే కాల్పుల ఘటనలు భయానికి గురిచేశాయి.