NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Syria:అసద్‌ పాలనలో నరకం..పెంపుడు సింహానికి భోజనంగా ఖైదీలు
    తదుపరి వార్తా కథనం
    Syria:అసద్‌ పాలనలో నరకం..పెంపుడు సింహానికి భోజనంగా ఖైదీలు
    అసద్‌ పాలనలో నరకం..పెంపుడు సింహానికి భోజనంగా ఖైదీలు

    Syria:అసద్‌ పాలనలో నరకం..పెంపుడు సింహానికి భోజనంగా ఖైదీలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 14, 2024
    05:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సిరియా తిరుగుబాటుదారుల చేతిలో రాజధాని డమాస్కస్‌ సహా ముఖ్య ప్రాంతాలు స్వాధీనం కావడంతో, అసద్‌ పాలనలో సాగిన క్రూరకాండలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

    అంతర్జాతీయంగా ఈ విషయాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టైగర్‌ ఫోర్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన అధికారి తలాల్‌ దక్కాక్‌ చేసిన అరాచకాలు మరింత కలవరపరిచే స్థాయిలో ఉన్నాయి.

    తలాల్‌ దక్కాక్‌ తన ఆధీనంలో దాదాపు 1500 మంది సైనికులను ఉంచుకుని, నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.

    2005లో తన అధికారాన్ని ఉపయోగించి జూ నుంచి సింహాన్ని తెప్పించుకుని, తనకు వ్యతిరేకంగా వెళ్తున్న వారిని ఆ సింహానికి ఆహారంగా వేశారు.

    Details

    దక్కాక్‌ పేరిట బలవంతపు వసూళ్లు

    ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఖైదీలను వ్యక్తిగతంగా తీసుకెళ్లి క్రూర శిక్ష విధించేవాడు.

    ఇదే అతని సాధారణ పద్ధతిగా మారింది. దక్కాక్‌ పేరిట బలవంతపు వసూళ్లు, కిడ్నాప్‌లు, హత్యలు, అవయవాల అక్రమ రవాణా వంటి నేరాలు జరగడం సాధారణ విషయమని నివేదికలు చెబుతున్నాయి.

    తిరుగుబాటుదారులు సిరియా పశ్చిమ ప్రాంతంలోని హమా పట్టణంలో దక్కాక్‌ను బహిరంగంగా ఉరితీశారు.

    ఈ చర్యకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడకపోయినా, హమా పట్టణ ప్రజలు ఈ నరరూప రాక్షసుడి అంతంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌తో పాటు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నా గ్రూపుల మధ్య ఐక్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Details

    ప్రాచీన విధానాలనే కొనసాగించాలని డిమాండ్

    వారిలో కొందరు ఇస్లామిక్‌ చట్టాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుండగా, మరికొందరు ప్రాచీన విధానాలను కొనసాగించాలని చూస్తున్నారు.

    సిరియా రెబల్‌ నేత జులానీ తిరుగుబాటుదారుల ఐక్యత సాధనకు ప్రయత్నాలు చేస్తుండగా, అది ఎంతవరకు సఫలమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

    మరోవైపు, తిరుగుబాటుదారులే ప్రస్తుతం పోలీసులు, సైనికుల స్థానంలో గస్తీ విధులను నిర్వహిస్తున్నారు. సాధారణ ప్రజలకు హాని చేయబోమంటూ హామీ ఇస్తున్నప్పటికీ, కొత్త ప్రభుత్వ నిర్మాణం సులభతరం కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

    సిరియా ప్రజలు గతంలో అసద్‌ పాలనలో ఎదుర్కొన్న బాధలు కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి.

    అంతే కాకుండా, తిరుగుబాటుదారుల నాయకత్వ మార్పుపై దృష్టి సారిస్తూ, ప్రజలు నూతన రాజ్యవ్యవస్థ కోసం ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిరియా
    ప్రపంచం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    సిరియా

    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు టర్కీ
    భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు టర్కీ
    టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు భూకంపం

    ప్రపంచం

    Israel Hamas Conflict: గాజా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు 350 సంవత్సరాలు.. ఐరాస నివేదిక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    Trami Storm : ఫిలిప్పీన్స్‌ను తాకిన టైఫూన్.. 130 మంది మృతి తుపాను
    China: చైనాలో జననాల రేటు క్షీణత.. మూతపడుతున్న పాఠశాలలు  చైనా
    Russia Visa: పర్యాటకులకు శుభవార్త.. 2025 నుంచి రష్యాకు వీసా అవసరం లేదు! రష్యా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025