భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం భారత్, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రగిల్చింది.
నిజ్జర్ హత్యకు భారత్కు సంబంధం ఉందంటూ సాక్షాత్తు కెనడా పార్లమెంట్ వేదికగా ఆ దేశ ప్రధాని ట్రూడో చెప్పడం సంచలనంగా మారింది.
అంతేకాకుండా ప్రతీకార చర్యగా ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను కెడనా బహిష్కరించింది. అయితే కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది. అవి నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది.
ఇంతకీ భారత్, కెనడా మధ్య వివాదం చెలరేగానికి కారణమైన ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ను దుండగులు కాల్చి చంపారు. సర్రేలోని గురుద్వారా వెలుపల ఈ ఘటన జరిగింది.
కెనడా
హర్దీప్ సింగ్ నిజ్జర్ స్వగ్రామం జలంధర్లోని భర్సింగ్పురా
హర్దీప్ సింగ్ నిజ్జర్ భారత్లోని జలంధర్లో గల భర్సింగ్పురా గ్రామానికి చెందినవారు. 1997లో పంజాబ్ నుంచి కెనడాకు వెళ్లి ప్లంబర్గా అక్కడే సెటిల్ అయ్యారు. అతనికి వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు.
కెనడాకు వలస వచ్చినప్పటి నుంచి అతను ఖలిస్థాన్ మిలిటెన్సీ గ్రూప్లో కీలకంగా పని చేశారు. భారత్ ప్రభుత్వం నిషేదిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్గా కొనసాగారు.
నిషేధిత వేర్పాటువాద సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే)లో నిజ్జర్ సభ్యుడు కూడా.
నిజ్జర్ను 2020లో భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. పంజాబ్లోని లూథియానాలో 2007లో ఆరుగురు మరణించిన, 40మంది గాయపడిన పేలుడుతో సహా అనేక కేసుల్లో నిజ్జర్ వాంటెడ్గా ఉన్నారు.
నిజ్జర్పై ఎన్ఐఏ రూ.10లక్షల రివార్డును ప్రకటించింది.