
India - Canada: ట్రూడో హయాంలో తీవ్రవాదులకు ప్రోత్సాహం: భారత్
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ (Mark Carney) ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో భారత్-కెనడా సంబంధాలపై కీలక ప్రకటన వెలువడింది.
భారత్ ఈ మార్పును స్వాగతిస్తూ, ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని ఆకాంక్షించింది.
ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) విలేకరులతో మాట్లాడారు. 'కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) హయాంలో తీవ్రవాదులు, ఉగ్రవాదులకు లైసెన్సులు లభించాయి.
దీని ప్రభావంతో ఇరుదేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇప్పుడు కొత్త నాయకత్వం వచ్చింది. పరస్పర నమ్మకంతో సున్నితత్వంతో మళ్లీ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించేందుకు అవకాశం ఉందని ఆశిస్తున్నామని జైస్వాల్ పేర్కొన్నారు.
Details
భారత్తో సంబంధాల పునరుద్ధరణపై ఆసక్తి
ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మార్క్ కార్నీ భారత్తో సంబంధాల పునరుద్ధరణపై ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ట్రూడో హయాంలో బలహీనమైన ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి పటిష్ఠం చేస్తానని స్పష్టం చేశారు.
భారత్తో కాకుండా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతోనూ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
Details
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
భారత్, కెనడా వృద్ధిగా మైత్రి దేశాలుగా కొనసాగినప్పటికీ, కొంతకాలంగా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ముఖ్యంగా 2023లో ట్రూడో తన పార్లమెంటులో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉండొచ్చని చేసిన ఆరోపణలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
భారత్ ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. ఈ వివాదం తర్వాత ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను నిర్బంధించి పంపించాయి. వాణిజ్య ఒప్పందాలు క్షీణించాయి.
కానీ తాజా రాజకీయ మార్పుల నేపథ్యంలో రెండు దేశాలు మరల కలిసి పనిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కొత్త ప్రధానితో భారత్ సంబంధాలు పునరుద్ధరించి, మునుపటి మైత్రిని తిరిగి పొందాలని ఆశపడుతోంది.